Lashkar-e-Taiba: దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడికి లష్కరే కుట్ర..
- ఇస్లామాబాద్ పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ ప్లాన్..
- ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు లష్కరే కుట్ర..
Lashkar-e-Taiba: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు సిద్ధమైంది. డిల్లీ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నింది. ఎర్రకోట సమీపంలో, చాందినీ చౌక్లోని ఒక ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మత ప్రదేశాల సమీపంలో పేలుళ్లకు ప్లాన్ చేస్తుందని భద్రతా సంస్థల నిఘా వెల్లడించింది. ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కరే తోయిబా దేశవ్యాప్త పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగిన మూడు నెలల తర్వాత ఇస్లామాబాద్ పేలుడు జరిగింది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడులో 12 మంది మరణించారు. హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తేలింది.
ఘటనకు ముందు భద్రతా అధికారులు ఏకంగా 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ బయటపడింది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో కీలక సభ్యులుగా ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ మరియు డాక్టర్ ఆదిల్ రాథర్లను అరెస్టు చేసిన తర్వాత, భయాందోళనకు గురైన ఉమర్ నబీ ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!