Pakistan: మరింత పేదరికంలోకి పాకిస్థాన్.. వెలుగులోకి సర్వే
- మరింత పేదరికంలోకి పాకిస్థాన్
- వెలుగులోకి షాకింగ్ సర్వే
- అభివృద్ధిలోకి దూసుకెళ్తోన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా సర్వేలను బట్టి వెల్లడవుతోంది.
అభివృద్ధిపై కాకుండా యుద్ధం కోసం విధానాలు రూపొందించే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. రక్షణ కోసం ఖర్చు చేసే వ్యయమంతా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. 2024-25లో 28.8 శాతం పాకిస్థానీయులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లుగా వెల్లడైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా తేలింది.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
ఇది కూడా చదవండి: Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్డాగ్లు’’.. టారిఫ్లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
పాకిస్థాన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం.. 2018-19లో పేదరికం రేటు 21.9 శాతం ఉండగా.. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 6.9 శాతం పెరిగి 28.8 శాతానికి చేరింది. ఈ ఫలితాలు 2024-25లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఉన్నాయి. పాకిస్థాన్లోని అన్ని ప్రావిన్సుల్లో.. ముఖ్యంగా పంజాబ్, సింధ్లలో పేదరికం పెరిగినట్లుగా పేర్కొంది.
గురువారం పాకిస్థాన్ వెబ్సైట్ ది న్యూస్తో ఉన్నత అధికారిక వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత ఆరు సంవత్సరాల్లో మూడు IMF స్థిరీకరణ కార్యక్రమాలు, కోవిడ్-19 ప్రభావం, కమోడిటీ సూపర్-సైకిల్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ GDP వృద్ధి రేటు, రెండు సూపర్ వరదలు, గోధుమ మద్దతు ధరను వదిలివేయడం వంటి అనేక కారణాల వల్ల పాకిస్థాన్లో పేదరికం స్థాయి పెరిగింది.’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం తగ్గింది. పేదరిక నిర్మూలనలో భారతదేశం విశేషమైన కృషి చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 10 సంవత్సరాలలో 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఇక అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతుంది. వికసిత్ భారత్లో భాగంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడంతో పేదరికం తగ్గింది.
ఇది కూడా చదవండి: Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!