పాకిస్తాన్ పై ఆఫ్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. ఆదివారం రాత్రి షార్జాలో తమ ప్రత్యర్థి పాకిస్థాన్పై ఏడు వికెట్ల విజయంతో పాటు సిరీస్ను కూడా ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది.
వాట్సాప్ గ్రూప్లో దైవదూషణ కంటెంట్ను పోస్ట్ చేశాడనే ఆరోపణలతో వాయవ్య పాకిస్థాన్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఓ ముస్లిం వ్యక్తిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ముస్లిం-మెజారిటీ పాకిస్తాన్లో దైవదూషణ అనేది చాలా సున్నితమైన సమస్య, ఇక్కడ నిరూపించబడని ఆరోపణలు కూడా హింసను రేకెత్తిస్తాయి.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ దిహాండ్రెడ్ లీగ్ లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరగా తాజాగా పనికూన ఆప్ఘానిస్తాన్ చేతుల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఓడడం అంటే అలా ఇలా కాదు.. కనీసం పోరాటం కూడా లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండ్ విభాగాల్లో అట్టర్ ప్లాప్ అయింది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ధరలు దారుణంగా పెరిగాయి. ఇక ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని పొందేందుకు ఇబ్బదిముబ్బడిగా పన్నులను పెంచింది. దీంతో అక్కడ విద్యుత్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిందని వ్యాఖ్యానించాడు. తాజాగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద డబ్బుల్లేవని వెల్లడించారు.
India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్…
ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ మరోసారి భారత్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసింది. అయితే, పాక్ చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. భారతదేశంలో మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించింది.
Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు…
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తోపాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది.…