Pakistan: పరువు కోసం పాక్ ఆర్మీ ప్రగల్భాలు.. భారత్పై దాడి చేయగలమంటూ బెదిరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సమస్యలు, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ పై యుద్ధం చేయలేదన్న విషయం అందరికి తెలిసు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా అంగీకరించినట్లు పాకిస్తాన్ సుప్రసిద్ధ జర్నలిస్టు హమీద్ మీర్ చెప్పారు. పాకిస్తాన్ వద్ద ఆర్మీ వాహనాలు ఉన్నాయి కానీ అందులో పోసే ఇంధనం లేదని, శతఘ్నలు ఉన్నాయి కానీ అందులో ఉపయోగించేందుకు మందుగుండు సామాగ్రి లేదని బజ్వా అన్నట్లు హమీద్ మీర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ లో సంచలనంగా మారాయి. దీంతో పాక్ ఆర్మీ తమ పరువు కాపాడుకునేందుకు వివిధ రకాల స్టేట్మెంట్లు ఇస్తోంది.
తాజాగా శతృవు భూభాగంలోకి వెళ్లి యుద్ధం చేయగలమని పాకిస్తాన్ ఆర్మీ ప్రగల్భాలు పలికింది. పాక్ ఆర్మీకి చెందిన డిజి ఐఎస్పిఆర్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ పాక్ సైన్యంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తమ ఆర్మీ సిద్ధంగా ఉందని.. యుద్ధం పరిస్థితి వస్తే భారత్ భూభాగంలో యుద్ధానికి దిగగలమని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్ సమయంలో పాకిస్థాన్ వైమానిక దళం దాన్ని చేసి చూపించిందని అన్నాడు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల అటాక్ లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చనిపోయిన తర్వాత భారత్ పాకిస్తాన్ లోని బాలకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేసింది.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
Read Also: Yogi Adityanath: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.. కాంగ్రెస్పై యోగి అటాక్..
ఇదిలా ఉంటే ఈ దాడిని గురించి ప్రస్తావిస్తూ.. పాక్ మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. భారత్ పిరికి దాడిని నిర్వహించిందని.. దానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టిందని గొప్పలకు పోయాడు. పాక్ ఎయిర్ ఫోర్స్ మాతృభూమి రక్షణ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, దురాక్రమణకు పాల్పడితే, శతృవు భూభాగంలో కూడా యుద్ధం చేస్తామని పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
భారత్ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం చేయలేదని పాక్ మాజీ ఆర్మీ చీఫ్ బజ్వా అంగకరించినట్లు, జర్నలిస్టులు హమీద్ మీర్, నసీమ్ జెహ్రా యూకేకు చెందిన పాకిస్తానీ మీడియా యూకే 44కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ పర్యటన గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బజ్వా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ విషయం అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కూడా తెలియదని హమీద్ మీర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!