Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది.
India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది.
ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్లోని వివిధ హైకోర్టుల ఆదేశాల మేరకు పీటీఐ చట్టసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 37 పార్లమెంట్ స్థానాలకు ఆదివారం పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది.
Bilawal Bhutto Zardari: జమ్మూ కాశ్మీర అంశాన్ని పాకిస్తాన్ పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు పాక్ ప్రతినిధులు. ముఖ్యంగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ను విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోసారి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. తాను కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండాగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఎజెండాతో సంబంధం లేకుండా ప్రతీ ఐక్యరాజ్యసమితి…
Pakistan: పాకిస్తాన్ దేశంలో హిందూ మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. అక్కడ మైనారిటీ హక్కులను కాలరాస్తున్న అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ లో ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు ధరమ్ దేవ్ రాతిని అతడి డ్రైవర్ హనీఫ్ లెఘారీ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో డాక్టర్ ధరమ్ దేవ్ రాతిని మంగళవారం డ్రైవర్ గొంతు కోసి హత్య చేశారు.…
Pakistan economic crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ప్రముఖ కంపెనీలు వెళ్లిపోతున్నాయి. తాజాగా ఆటోమోబైల్ దిగ్గజం హోండా కూడా పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పింది. బుధవారం తన ప్లాంట్ ను మూసేస్తున్నట్లు హోండా ప్రకటించింది. సప్లై చైన్ కు అంతరాయం ఏర్పడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణం అని…
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
పాకిస్థాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలోని నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.