Pakistan: భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని వణుకుతున్న పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan fears India may conduct another surgical strike: జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 మంది సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో వచ్చే నెలలో భారత్ నిర్వహిస్తున్న జీ-20 సమావేశం ముందు భయోత్పాతాన్ని రేపేందుకు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ లోని పలువురు మాజీ అధికారులు, దౌత్యవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Pakistan: పరువు కోసం పాక్ ఆర్మీ ప్రగల్భాలు.. భారత్పై దాడి చేయగలమంటూ బెదిరింపు..
Also Read
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్కు వార్నింగ్
- Trump: ఫుట్బాల్ ప్లేయర్ నిషేధంపై ట్రంప్ సమీక్ష.. దుమారం రేపుతోన్న అధ్యక్షుడి తీరు
- Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
తాజాగా పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. భారత్ మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ దాడి నిర్వహించే అవకాశం ఉందని భయపడుతున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్గా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయగలదని పాకిస్థాన్ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం పాక్ ప్రజలు భారతదేశం మరోసారి సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానికి దాడుల గురించి మాట్లాడుతున్నారని.. అయితే ఈ ఏడాది భారత్ జీ-20, SCO సమావేశాలకు అధ్యక్షత వహిస్తోందని, ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ పై దాడులు చేయకపోవచ్చని, కానీ వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో భారతదేశం దాడులు చేసే అవకాశం ఉందని అబ్దుల్ బాసిత్ అన్నారు.
పూంచ్ ఉగ్రదాడి గురించి కూడా బాసిత్ మాట్లాడుతూ.. ముజాహిదీన్ లేదా ఎవరైనా సరే, వారు సైనికులను లక్ష్యంగా చేసుకున్నారని, పౌరులను కాదని చెప్పారు. మీరు ఉద్యమం చేస్తుంటే.. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటారని, పౌరులను కాదని, అంతర్జాతీయ చట్టం దీనికి అనుమతిస్తుందని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
-
Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!