India: పాకిస్తాన్లో దాక్కున్న 23 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్కు వెళ్లారు. ఆ తర్వాత, వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కిష్ట్వార్ ఎస్ఎస్పీ ఖలీల్ పోస్వాల్ తెలిపారు.
వీరందరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని ఆయన అన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయబడిందని వెల్లడించారు. ఇప్పటికే వీరి అరెస్ట్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయిందని, వారిని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు. యూఏపీఏ చట్టం ప్రకారం వీరందరిపై చత్రు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
Read Also: Ram Charan: ఏజెంట్ సినిమాలో మెగా పవర్ స్టార్… ఊహించని షాక్ ఇచ్చారు
చీనాబ్ లోయ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో అశాంతిని సృష్టించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు నిందితులపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డీఎస్పీ విశాల్ శర్మ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పాకిస్తాన్ లో తలదాచుకుంటూ.. స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకుని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయాలని, భారత్ కు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని, వేర్పాటువాదాన్ని పెంచాలని చూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తమ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత పాకిస్థాన్పై ఉందని.. పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు మేము ఇంటర్పోల్ను భాగస్వామ్యాన్ని కోరామని, పాకిస్థాన్ సహకరించడంలో విఫలమైతే ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. చట్ట ప్రకారం అటాచ్మెంట్ కోసం ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించేందుకు వివిధ రెవెన్యూ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు
- Tags
- india
- NIA court
- Pakistan
- PoK
- terrorists
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!