రాజకీయ నేతలు…ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. కాలు జారినా ఫర్వాలేదు…కానీ నోరు జారొద్దనేది నానుడి. అయితే బీఆర్ఎస్ సీనియర్ పొలిటిషియన్…మాత్రం ఓ డిప్యూటీ సీఎంపై టంగ్ స్లిప్పయ్యారు. అంతటితో ఆగని ఆమె…బై లక్ పదవి వచ్చిందంటూ కామెంట్ చేశారు. దీనిపై ఆ డిప్యూటీ సీఎం అభిమానులు, కార్యకర్తలు…అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు ? ఇంతకీ ఎవరా బీఆర్ఎస్ లీడర్ ? రాజకీయాల్లో నేతలు ఎవరైనా సరే…ఎంతటి స్థాయిలో ఉన్నా సరే…ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేసే అడుగులైనా…జనం ముందు…
ఏపీ బీజేపీ నేతలు వర్గాలుగా విడిపోయారా ? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేసి…ఆధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారా ? మా టైం వచ్చిందని చెబుతున్నదెవరు ? ఆ సీనియర్ నేతకు పదవి రావడంతోనే…కమలం దళంలో చీలికలు వచ్చాయా ? ఇంతకీ ఎవరా నేతలు ? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. నిన్న మొన్నటి దాకా…ఎలాంటి గ్రూపులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు పని చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రాష్ట్ర పార్టీ…
నిన్న మాధవ్.. నేడు యాదవ్… సీఐ రూట్లోనే ఎస్సై కూడా ఖాకీ వదిలేసి ఖద్దర్ తొడగాలనుకుంటున్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఎస్సై సుధాకర్ యాదవ్ డైరెక్ట్ అటాక్కి… బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగానే వినిపిస్తోందా? ఆయనకు రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అసలు సుధాకర్ యాదవ్ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎన్ని రోజులని ఇలా… ఖద్దరు చెప్పినట్టు వింటాం…… వాళ్ళకు సలాం కొడతాం…. ఆ ఖద్దరేదో మనమే వేసుకుంటే పోలా? రూలింగ్లోకి వస్తే……
ఆవులు ఆవులు పొడుచుకుంటే…. మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా అక్కడి రాజకీయం మారిందా? రాష్ట్ర స్థాయి హయ్యెస్ట్ పోస్టుల్లో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనడం సెగలు పుట్టిస్తోందా? ఎవరికి వారు ప్రోటోకాల్తో కొట్టే ప్రయత్నం చేయడం రక్తి కట్టిస్తోందా? ఎవరా ఇద్దరు? ఏంటా పోటీ రాజకీయం? జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు వ్యవహారం… నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య అగ్గి రాజేసిందట. ఈ విషయంలో పరస్పరం…
అక్కడ మొన్నటిదాకా కాలర్ ఎగరేసుకు తిరిగిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇపుడు కన్ఫ్యూజన్లో పడ్డారా? ఆయన అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయి తప్పు చేశామా అంటూ… ఇప్పుడు ఫీలవుతున్నారా? ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్ తమను నిండా ముంచేశారంటూ తెగ ఫీలైపోతున్నారా? కేడర్లో కాన్ఫిడెన్స్కంటే నా యాపారమే నాకు ముఖ్యమని అంటున్న ఆ నాయకుడెవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? దెందులూరు.. పొలిటికల్ హైడ్రామాలు, హై టెన్షన్స్కి కేరాఫ్. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడి రాజకీయం ప్రత్యేకమే. 2019…
ప్లీనరీ సక్సెస్ కోసం గులాబీ అధిష్టానం స్పెషల్ స్కెచ్ వేసిందా? పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా…. జన సమీకరణ విషయంలో డౌట్స్ ఉన్నాయా? అందుకే పార్టీ నాయకులకు బంపరాఫర్ ప్రకటించేసిందా? చెప్పాల్సింది చెప్పేసి… ఇక మీ ఇష్టం…. మీ సత్తా…. నిరూపించుకోండని వదిలేసిందా? వరంగల్ గ్రౌండ్ నింపేందుకు బీఆర్ఎస్ పెద్దలు పెట్టిన స్కీమ్ ఏంటి? టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? అధికారంలో లేకున్నా డోంట్ మైండ్… పార్టీ రజతోత్సవ వేడుకల్ని మాత్రం గ్రాండ్గా నిర్వహించాలని…
వైసీపీ అధ్యక్షుడు జగన్ని విమర్శించడానికి ఏపీ మంత్రులు ఎక్కువ మంది వెనకాడుతున్నారా? ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… వీళ్ళు దీటుగా కౌంటర్స్ వేయలేకపోతున్నారా? ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ వెనకడుగు వెనకున్న రీజనేంటి? ఆ విషయమై టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శల వాడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్…
ఆ నియోజకవర్గంలో కారు వోవర్ లోడ్ అయిందా? పేరుకు అంతా లీడర్సేగానీ….స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు కరవయ్యారా? అసలు డ్రైవర్ సీటే ఖాళీ లేనంతగా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? చివరికి వర్గపోరు ఆ మాజీ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా ఈక్వేషన్స్? నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు ఓవర్ లోడ్ అయ్యిందట. స్టీరింగ్ మాక్కావాలంటే… మాక్కావాలంటూ పలువురు నేతలు చూపుతున్న ఉత్సాహమే ఇందుకు కారణమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక్కడ కేడర్కంటే లీడర్స్…
అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్? ఎవరా ఇద్దరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది…
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సన్నివేశాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయా? కొద్దో గొప్పో పసుపు ఫ్లేవర్ తగిలితేనే కాషాయ దళంలో పదవులు దక్కుతున్నాయా? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామంటూ జబ్బలు చరుచుకునేవారికి చివరికి మిగిలేదా వాపులు, కాపడాలేనా? ఏపీ కమలంలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? పార్టీలో అసలేం జరుగుతోంది? నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? కేవలం కాషాయం ఒక్కటే ఉంటే సరిపోదు…. అదనంగా కాస్త పసుపు కలర్ని జోడిస్తేనే పదవులు అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాట్లాడుకుంటున్నారట.…