Off The Record: కురుపాం టీడీపీలో పీక్స్కు చేరిన విభేదాలు..
- కురుపాం టీడీపీలో పీక్స్కు చేరిన విభేదాలు..
- పర్సంటేజ్ లేకుండా ఏ పనీ జరగడం లేదన్న ఆరోపణలు..
- అవినీతి ఆరోపణలు, కేడర్లో అసంతృప్తి..
- బదిలీల్లో అంతా ఎమ్మెల్యే ఇష్టారాజ్యం అయిపోయిందా?..
- ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసి కౌంటర్ పెట్టేశారా?..
- పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్ట్ కోసం భారీగా వసూలు చేశారా?..
- టీడీపీ మండల కన్వీనర్ పోస్ట్ కోసం కూడా బేరాలేనా?..
- గోకులం షెడ్స్ నిర్మాణంలోనూ ఫిక్స్డ్ పర్సంటేజ్లా?..
- లోకల్గా సహకారం లేదని లోకేష్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారా?..
- ఇక్కడ ఇలా.. అక్కడ అలా అంటూ కురుపాం టీడీపీలో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ.. ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేయాల్సిందంతా చేసేసి… పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా? వసూల్ రాజా ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతుంటే…. లోకల్ లీజర్స్ అంతా కలిసి నన్ను ఒంటరిని చేశారని మొత్తుకుంటున్నారా?.. పార్టీ పదవుల్ని సైతం అమ్ముకుంటున్నారని ఆరోపణలున్న ఆ శాసనసభ్యురాలు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి?
Read Also: Cyber Crime: సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్న టీజీ పోలీసులు.. రాష్ట్రం దాటినా వదలట్లే…
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు ఏ రేంజ్లో నడుస్తున్నాయట. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి వర్సెస్ అదర్స్ అన్నట్టుగా పోరు జరుగుతోందని చెప్పుకుంటున్నారు. పైకి కనిపిస్తూ కొంత… కనిపించకుండా ఎక్కువగా యుద్ధం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ముఖ్యంగా దందాలు, అక్రమ వసూళ్ళలో ఎమ్మెల్యే మనుషులు చెయ్యి తిరిగిపోయారని, చివరికి సొంత పార్టీ వాళ్ళయినాసరే… చెయ్యి తడపనిదే పనులు జరగడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందే ఉన్న వర్గాల అగ్గికి ఎమ్మెల్యే వైఖరి ఆజ్యం పోస్తోందని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన నాయకుడు వీరేష్ చంద్రదేవ్ను పూర్తిగా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!
అదే సమయంలో కేడర్లో అసంతృప్తి కూడా గణనీయంగా పెరిగిందని, అన్నీ కలగలిసి కురుపాంలో టీడీపీని గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నాయన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్యేకి సహకరించడం లేదట. అది నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ పటిష్టతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కేడర్లో ఆందోళన పెరుగుతోందట. లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడం, అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యే జగదీశ్వరి ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి కాంట్రాక్ట్లు, బదిలీలు అన్నిటిలో వసూళ్ళ పర్వం నడుస్తోందని, స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేసేశారన్న ఆరోపణలు నియోజకవర్గం మొత్తం మార్మోగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కీలక పోస్టింగ్స్ కోసం డబ్బులు వసూలు చేశారని, ఈ డీల్ను కురుపాం లోకల్ నాయకుడే నిర్వహించాడని నియోజకవర్గంలో బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
Read Also: Jiiva: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో జీవా ప్రయోగం
చివరికి పార్టీ పోస్ట్లకు కూడా ఎమ్మెల్యే బేరం పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ మండల కన్వీనర్ పదవి కావాలంటే.. తనకు మహానాడు కార్యక్రమానికి వెళ్ళిరావడానికి ఫ్లైట్ టికెట్లు, ఇతర ఖర్చులు భరించాలని ఓ నాయకుడుడిని డిమాండ్ చేశారన్న అంశంపై అప్పట్లో గట్టి చర్చే జరిగింది కురుపాంలో. ఇలాంటి చర్యల వల్ల పార్టీ కోసం నిజంగా కష్టపడే కార్యకర్తకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. అలాగే ప్రతి గోకులం షెడ్ నిర్మాణంలో పార్టీకి చెందిన వ్యక్తులే ముందే పర్సంటేజ్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అభివృద్ధి పథకాలను కూడా వ్యాపార కోణంలో చూడటం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహారాలపై స్థానిక నాయకులు.. మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్కు ఫిర్యాదు చేశారట.
Read Also:
కానీ, ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా లేవని, నాయకులు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులే వెటకారాలాడుతున్నారట. కురుపాంలో చేయకూడని అరాచకాలన్నీ చేసేసి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే… ఆ వరదలో అన్నీ కొట్టుకుపోతాయా అంటూ కేడర్ చర్చించుకుంటోందట. మొత్తం మీద కురుపాం విషయంలో టీడీపీ అధిష్టానం వెంటనే.. సీరియస్గా జోక్యం చేసుకోకుంటే… ఇక్కడ పార్టీ పునాదులే కదిలే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!