ఆ జిల్లాలో టీడీపీకి మరోసారి ఇబ్బందులు తప్పలేదు. పేరుకు ఎన్నికలు బహిష్కరణ అని చెప్పినా.. బ్యాలెట్ పేపరుపై పార్టీ సింబల్ ఉంది. అభ్యర్థులు ప్రచారం చేశారు. కానీ.. ఓట్లు రాలేదు. సెంటిమెంట్ పండలేదు. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. ఇంతకీ ఏంటా జిల్లా? అధికారం కోల్పోయాక అసలు సంగతి గుర్తించారా? టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక…
ఇటీవల కాలంలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ తలనొప్పులే. కనీసం కంటి నిండా నిద్ర కూడా పడటం లేదట. లేఖలు పరేషాన్ చేస్తున్నాయట. ఇక నిరసనలు, ధర్నాలు సరేసరి. అవి ఎవరు చేశారో.. ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవచ్చు. కానీ.. సీఎమ్కు లేఖలు రాస్తుండటంతో ఉలిక్కి పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయనెవరో.. ఆ సమస్యేంటో ఈ స్టోరీలో చూద్దాం..! సమస్యలపై నేరుగా సీఎమ్కే నిరసనకారుల లేఖలు? రాథోడ్ బాపురావ్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే. ఇంతకాలం నియోజకవర్గంలో హ్యాపీగా…
అధికారపార్టీలో చిన్న పదవైనా ఎంతో డిమాండ్ ఉంటుంది. దానికి సెంటిమెంట్ కూడా తోడైతే పోటీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ పదవి కోసం విపరీతమైన పోటీనే నెలకొంది. కాకపోతే పాత విద్యార్థి.. కొత్త విద్యార్థి అనే పేరుతో యువ నేతల మధ్య రేస్ మొదలుకావడంతో ఆ పదవిపై ఉత్కంఠ పెరుగుతోంది. టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి కోసం పోటీ! సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది అధికారపార్టీ టీఆర్ఎస్. సెప్టెంబర్ 2 నుంచి పార్టీ నేతలంతా ఇదేపనిలో ఉన్నారు.…
మాకు అది చెప్పలేదు.. ఇది చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది. గాంధీభవన్లో జరిగిన మీటింగ్పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రు కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్…
ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేశారు. అధికారపార్టీలో చర్చగా మారారు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు. వర్గపోరు మళ్లీ రాజుకుని.. సొంత పార్టీలోనే వైరిపక్షాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారెవరో.. ఆ రగడేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీ భరత్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు మరోసారి చర్చగా మారాయి. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో ఓ ఘటన యువనేతల మధ్య ఉన్న ఆధిపత్య…
చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…! కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..! కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ…
మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో..…
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి.. ఓడింది రెండుసార్లు. పార్టీ అవకాశం ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది. ఈసారి కష్టమని భావించారో ఏమో ఇంకో నియోజకవర్గంపై కర్చీఫ్ వేయాలని చూస్తున్నారట. దీంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందా లేక.. షాక్ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన? మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్! విశాఖ జిల్లా మాడుగుల. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే…
ఆ అధికారపార్టీ ఎంపీ ఆల్రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారా? సొంత సామాజికవర్గమే కావడంతో పక్క నియోజకవర్గ ఎంపీతో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారా? ఇదంతా సేఫ్ గేమ్లో భాగమా లేక.. భవిష్యత్ రాజకీయ వ్యూహమా? సొంత పార్టీలోనూ అనుమానాలకు బీజం పడిందా? ఎవరా అధికార పార్టీ ఎంపీ? ఏంటా స్నేహగీతం..! ఎంపీ పాటిల్ కొత్త స్నేహాలపై చర్చ! బీబీ పాటిల్. జహీరాబాద్ ఎంపీ. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి గెలిచారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నికల్లో…
నిర్మల్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! అమిత్ షా మాటలు చురుకు పుట్టించాయా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు.…