వివాదాస్పద కామెంట్స్ చేసిన టీడీపీ మహిళా నేతలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారి మాట జారితే అవి ఎంత దూరం తీసుకెళ్తాయో.. వాటి పర్యవసానాలను ఊహించడం కష్టం. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. కలకలం రేపిన ఆ మహిళా నేతల పరిస్థితి అలాగే ఉంది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వారి వెనక ఎవరున్నారన్నది ప్రశ్నే.
టీడీపీ మహిళా నేతల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..!
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైన తర్వాత.. అనంతపురం తమ్ముళ్లు, మహిళా నేతలు ఓ రేంజ్లో అధికారపార్టీపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలు వివాదాస్పదంగా మారాయి కూడా. చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారన్న బాధతోనో.. లేక వైసీపీపై ఆగ్రహంతోనో.. కొందరు టీడీపీ మహిళా నేతలు చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. మీడియా ముందుకు వచ్చిన టీడీపీ మహిళా నాయకులు.. వైసీపీ నేతల తీరును ఖండించారు. అక్కడితో సరిపెడితే బాగోదనుకున్నారో ఏమో.. ముఖ్యమంత్రిపైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా.. మంత్రులపైనా ఘాటైన పదజాలమే ఉపయోగించారు. టీడీపీ మహిళా నేతలు చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
టీడీపీ మహిళా నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు..!
ఆ వ్యాఖ్యలకు సంబంధించి పోలీస్ యాక్షన్ మొదలైంది. నవంబర్ 24న 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు ఖాకీలు. అంత జరిగినా మహిళా నేతలు తగ్గలేదు. మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటిరోజే నగరంలోని టీడీపీ మహిళా నేతల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో భగ్గుమన్న మహిళా నేతలు.. కుటుంబసభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులతో గొడవపడ్డారు కూడా. ఈ ఘటనలు చర్చగా మారాయి.. రచ్చ రచ్చ చేశాయి.
అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ మహిళా నేతలు..!
ఇంతలో సీన్ అనంతపురం నుంచి విజయవాడకు మారింది. టీడీపీ మహిళా నేతలు.. విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహించి.. అక్కడి నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ నుంచి అనంతపురానికి మహిళా నేతలు తిరిగి వస్తారని భావించిన పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చారు. విచారణ కోసం వస్తామన్న వాళ్లు.. అజ్ఞాతంలోకి వెళ్లడంతో తల పట్టుకున్నారు ఖాకీలు. ఇప్పుడీ వివాదం పోలీసులు వర్సెస్ టీడీపీ మహిళా నేతలు అన్నట్టుగా మారిపోయింది.
మహిళా నేతల కామెంట్స్ వెనక డైరెక్షన్ ఎవరిది?
మీడియా ముందు కామెంట్స్ చేసింది టీడీపీ మహిళా నేతలే అయినా.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరన్న దానిపై పోలీసులు పోకస్ పెట్టారు. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. డైరెక్షన్ ఎవరిది. మాటల రచయతలు ఎవరు? ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారు? ఆర్థిక లావాదేవీలు ఇలా వివిధ అంశాలను లోతుగా పరిశీలిస్తున్నారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్న మహిళా నేతలను విచారిస్తే .. ఆ విషయాలు వెలుగులోకి వస్తాయని అనుకుంటున్నారట. అందుకే ఈ ఎపిసోడ్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిళ్లలో పెరిగిపోతోంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?