మంచిర్యాలలో వీహెచ్ను అడ్డుకున్న సొంత పార్టీ నాయకులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్లో తన్నులాట.. ఫిర్యాదుల పర్వాలు కొత్తేమీ కాదు. అలాంటి పార్టీలో ఆయన్ను ఎవరైనా విమర్శించాలి అంటే వెనకా ముందు ఆలోచిస్తారు. ఆ జిల్లాలో మాత్రం ఏకంగా ఆయన్ని నానా మాటలు అనేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పుడేం జరుగుతుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో పెరిగిపోతోంది.
వీహెచ్ను అడ్డుకున్న ప్రేమ్సాగర్రావు వర్గం..!
Also Read
వరి రైతుల సమస్యలపై తెలంగాణలో వరసగా ఉద్యమిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంచిర్యాల వెళ్లారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. అక్కడ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోకి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధం కాగా.. VH, రాములు నాయక్లను.. మరో కాంగ్రెస్ నేత ప్రేమ్సాగర్రావు వర్గం అడ్డుకుంది. అంతేకాదు.. సొంత పార్టీ నాయకులను దూషించిందట.
పార్టీ ఇంఛార్జ్ ఠాగూర్కు ఫోన్లో వీహెచ్ ఫిర్యాదు..!
సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే.. పోలీసులు అడ్డుకోవడం చూస్తాం. కానీ.. అక్కడ మాత్రం సొంత పార్టీ నాయకులను కాంగ్రెస్లోని మరో వర్గం అడ్డుకోవడం విశేషం. ఈ పరిస్థితి చూసి VH, రాములు నాయక్లకు చిర్రెత్తికొచ్చిందట. అక్కడి నుంచే AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారట. VH, రాములు నాయక్ ఇద్దరూ వెంట వెంటనే ఫోన్ చేసి గట్టిగానే మాట్లాడినట్టు సమాచారం.
ఠాగూర్ నుంచి ఫోన్లు రావడంతో రేవంత్ అలర్ట్..!
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావు తన వర్గంతో.. నచ్చని వారిపై దాడులు చేయిస్తున్నారన్నది కాంగ్రెస్ హైకమాండ్కు వెళ్లిన ఫిర్యాదు. సమస్య తీవ్రతను గుర్తించారో.. లేక సమస్య ముదురు పాకాన పడకుండా చూడాలనుకున్నారో కానీ.. వెంటనే పీసీసీ చీఫ్ రేవంత్కు ఫోన్ చేసి మాట్లాడారట ఇంఛార్జ్ ఠాగూర్. మంచిర్యాలలో ఏం జరిగిందో వాకబు చేయాలని కోరారట. ఈ రగడపై ఠాగూర్కు వరసగా ఫిర్యాదులు వెళ్లడంతో రేవంత్ సైతం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. వెంటనే వీహెచ్కు ఫోన్ చేసి మాట్లాడారట.
ప్రేమ్సాగర్రావు అండ్ కోపై చర్యలకు వీహెచ్ పట్టు..!
ప్రేమ్సాగర్ రావుపైనా.. ఆయన వర్గంపైనా చర్యలు తీసుకోవాలన్నది AICCకి అందుతున్న ఫిర్యాదుల సారాంశం. అసలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కానీ.. అక్కడి నేతలపై ఫిర్యాదులు ఎక్కువే. ఇప్పటికే ప్రేమ్సాగర్రావు, మహేశ్వర్రెడ్డి మధ్య గొడవలు ఉన్నాయి. ఆ పంచాయితీలు కొలిక్కి వస్తున్న తరుణంలో నేరుగా వీహెచ్తోనే గొడవ పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్రావు. పైగా.. ఈ గొడవను వీహెచ్ ఇక్కడితో వదిలిపెట్టేలా లేరు. ప్రేమ్సాగర్రావుతోపాటు.. నాటి ఆందోళనలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని PCCపై గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారట.
బీసీ, ఎస్టీలను అడ్డుకోవడం తప్పుడు సంకేతాలు పంపుతుందని వాదన..!
మంచిర్యాలలో రైతులకు మద్దతుగా నిరసనలు చేయడానికి బీసీ, ఎస్టీ నాయకులు వెళ్లినప్పుడు.. వారినే అడ్డుకోవడం.. దూషించడం తప్పుడు సంకేతాలు పంపుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారట. అందుకే ఆందోళన చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారట. మరి.. మంచిర్యాల రగడకు పార్టీ ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!