Odisha Train Accident: రాంగ్ సిగ్నలింగ్ వల్లనే ఒడిశా రైలు ప్రమాదం.. సేఫ్టీ కమిషన్ నివేదికలో వెల్లడి
Odisha Train Accident: ఒడిషాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది. బహుళ స్థాయిలో జరిగిన లోపాలను కమిటీ తన నివేదికలో ఎత్తి చూపింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని నివేదిక పేర్కొన్న సేఫ్టీ కమిషన్.. గతంలో జరిగిన లోపాన్ని సరి చేస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదని రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో స్పష్టం చేసింది.
Read also: Chicken Quality Test: మీరు తినే చికెన్ తాజాదేనా.. ఈ చిట్కాలతో టెస్ట్ చేయండి?
Also Read
కమిషన్ తన నివేదికను సమర్పిస్తూ.. రాంగ్ వైరింగ్, సిగ్నలింగ్, సర్క్యూట్లో లోపాలు ప్రమాదానికి కారణమని నివేదికలో తెలిపింది. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్పూర్ డివిజన్లో రాంగ్ వైరింగ్, కేబుల్లో లోపాల కారణంగా ఇలాంటి ఘటనే జరిగిందని కమిషన్ గుర్తు చేసింది.. ఆ సంఘటన తర్వాత రాంగ్ వైరింగ్ సమస్య పరిష్కారానికి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉన్నట్లయితే బహనగ బజార్ వద్ద ప్రమాదం జరిగి ఉండేదని కాదని నివేదికలో అభిప్రాయపడింది. సైట్లో కంప్లీషన్ సిగ్నలింగ్ వైరింగ్ రేఖా చిత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, సిగ్నలింగ్ సర్క్యూట్ల అక్షరాలను అప్డేట్ చేసేందుకు ఓ డ్రైవ్ను ప్రారంభించాలని.. అలాగే మార్పుల కోసం ప్రామాణిక పద్ధతులను అనుసరించాలని సూచించింది. సిగ్నలింగ్ సర్క్యూట్లు, పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించాలని కమిషన్ నివేదికలో సూచించింది.
Read also: President: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇంకా తన నివేదికలో ఇలాంటి విపత్కర ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతిస్పందన వేగంగా ఉండాలని, జోనల్ రైల్వేల్లో విపత్తు ప్రతి స్పందన వ్యవస్థను సమీక్షించాలని, ఎన్డీఆర్ఎఫ్ వంటి వివిధ విపత్తు ప్రతిస్పందన దళాల మధ్య సమన్వయాన్ని సమీక్షించాలని రైల్వేలకు సూచించాలని నివేదికలో సూచించింది. ఒడిషా రాష్ట్రం జూన్ 2న బాలాసోర్ బహనగ బజార్ వద్ద జరిగిన ప్రమాదంలో 292 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఇది దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదంగా నిలువగా.. ఘటనలో మృతి చెందిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 50 మంది మృతులను గుర్తించాల్సి ఉంది. మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి.. మృతుల ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!