Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్..
Semiconductor: భారతదేశం పెట్టుబడుకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే పలు సెమికండక్టర్ దిగ్గజ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ రంగంలో చైనా, తైవాన్ నియంతృత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిప్ తయారీకి భారత్ గమ్యస్థానంగా మార్చాలని కేంద్ర భావిస్తోంది. ఇప్పటికే ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు యూకే కు చెందిన మరో కంపెనీ ఒడిశాలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మొదటి దశలో రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. SRAM & MRAM టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూకే అధారిత కంపెనీ. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి.
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
Read Also: Nadipelli Diwakar Rao : మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్ధిగా మళ్లీ దివాకర్ రావు.!
గంజాం జిల్లాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆ జిల్లా కలెక్టర్ దిబ్యా జ్యోతి పరిదా పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ను దాదాపుగా 800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒడిశాలోని పలు జిల్లాలను సందర్శించినప్పటికీ.. గోపాల్పూర్ ఓడరేవు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, ఎయిర్స్ట్రిప్ మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున గంజాం జిల్లాలోని ఛత్రపూర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్ళలో యూనిట్ని స్థాపించి 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి దాదాపు ₹ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి తదుపరి దశల్లో యూనిట్ను విస్తరించాలని కూడా యోచిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుత యుగంలో సెమికండక్టర్స్ చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సెమికండక్టర్లతో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ సెట్లు, ల్యాప్టాప్లు, ఎయిర్ కండిషనర్లు, కార్లకు చిప్ సెట్స్ అవసరం. ఏటా మన దేశం దాదాపు ₹ 3 లక్షల కోట్ల సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. కంపెనీలు భారత్ లో వెలిస్తే విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
-
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!