Pakistan: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్లో కంగారు పెట్టిస్తోంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో తేల్చుకోని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. మరోవైపు, ఇరాన్పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్లో గొడవకు కారణమైందని అక్కడి రాజకీయ నాయకులు చెప్పారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ అబ్దుల్ ఖాదీర్ పటేల్ ఇజ్రాయిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య కేవలం ఒకే దేశం మిగిలి ఉంది అది ఇరాన్. ఇరాన్ వరకు ఇప్పటికే వారి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మాత్రమే మిగిలింది. మీరు నమ్మినా నమ్మకపోయినా తర్వాత టార్గెట్ పాకిస్తానే అవుతుంది’’ అని ఖాదీర్ అన్నారు. పాకిస్తాన్ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ.. ఈ చెంచాగిరి, ఈ ఒప్పందాలు మిమ్మల్ని రక్షించవు అని అన్నారు. యుద్ధంలో మరణించిన ఖమేనీని ఆయన అమరవీరుడిగా కొనియాడారు.
Read Also: Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
మరో ఎంపీ అలీ మహ్మద్ ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీరు ఏమనుకుంటున్నారు.? టార్గెట్ ఇరాన్ మాత్రమే అని అనుకుంటున్నారా.? ఇరాన్ ఒక కారణం మాత్రమే, అసలు టార్గెట్ పాకిస్తాన్’’ అని హెచ్చరించారు. గతంలో ఇజ్రాయిల్ ప్రధాని డెవిడ్ బెన్ గురియన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, పాక్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులారా, మీ దేశం గురించి ఆందోళన చెందండి, ఇబ్బంది వస్తోంది. మీ విధ్వంసానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి’’ అని అన్నారు.
గతంలో పాకిస్తాన్ ఏర్పాటు గురించి ఇజ్రాయిల్ ప్రధాని గురియన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒక సిద్ధాంతనికి ప్రతిస్పందనగా ఏర్పడిన దేశం. అది మిత్రదేశం ఇండియాను విభజించి రూపొందించబడింది అని అన్నారు. ఇరాన్,కు నష్టం జరిగితే దాని ప్రభావం పాకిస్తాన్పై ఉంటుందని పాక్ నేతలు హెచ్చరించారు. ఖమేనీ హత్య తర్వాత పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్పై దాడి జరిగింది. లాహోర్, ఇస్లామాబాద్, స్కర్దు వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 10 మందికిపైగా మరణించారు. 90 మంది గాయపడ్డారు.