వైసీపీ అధినేత జగన్కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్కు రియాలిటీ ఏంటో తెలిసి వచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియరైందా? మన వాళ్ళు ఎవరు? కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్కు తెలిసివచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియరైంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.చిన్న చితకా పార్టీ కార్యక్రమాలైతే… ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు…
తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీ డీఎన్ఏలోనే ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోందా? సీఎం చంద్రబాబు హెచ్చరికల్ని సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా? పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు కొందరు? ఎమ్మెల్యేల మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు. పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం. కానీ… ఈ టైంలోనే… కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గాడి…
తమలో ఒకరికి మంత్రి పదవి కావాలంటూ ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా? పార్టీ పెద్దలకు ప్రేమలేఖ రాయబోతున్నారా? ముందంతా అభిప్రాయాలు పంచేసుకుని… తమలో తామే మాట్లాడేసుకున్న ఎమ్మెల్యేలు తీరా లేఖ మీద సంతకం చేయాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గుతున్నారా? ఇంతకీ వాళ్ళకి పదవి కావాల్నా? వద్దా? ఎవరా నలుగురు? ఏంటా కథ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టైం దగ్గరపడుతున్న కొద్దీ….ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలో అయితే… రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో…
పేరుకు రాష్ట్ర మంత్రి అయినా… ఆయన్ని ఆ జిల్లాలో పట్టించుకునే వాళ్ళే లేరా? ప్రత్యేకించి తాను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే… ఎవరయ్యా నువ్వు అన్నట్టుగా ఉంటున్నారా? ఎమ్మెల్యేల తీరుతో అమాత్యులవారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతోందా? ఛీ…… డ్యాష్లో జీవితం అనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకంత దారుణంగా మారిపోయింది పరిస్థితి? చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారట. దాన్ని…
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల విషయంలో కొందరు నాయకులు నారాజ్గా ఉన్నారా? దగ్గరిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయినట్టు ఫీలవుతున్నారా? చూసినన్నాళ్లు చూశాం… ఏదో… ఇప్పుడే కదలిక వస్తోందనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ అవరోధాలేంటని ఫీలవుతున్నారా? పార్టీ పాతికేళ్ళ పండగతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాల్సిన నాయకులు ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ఏడాది పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్న బీఆర్ఎస్…. రజతోత్సవ వేడుకల్ని గ్రాండ్గా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ… పార్టీ నాయకులు కొందరికి ఆ వేడుకలే…
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక…
అధికారం చేతిలో ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు. నా అంతటోళ్ళు లేరన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీదికి తొడగొట్టాడు. మీసం మెలేశాడు…. కట్ చేస్తే ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారా మాజీ మంత్రి. దాంతో వేషాలన్నీ పవర్ ఉన్నప్పుడేనా? అంతా గాలి బుడగ సామెతేనా అంటూ సెటైర్స్ పడుతున్నాయట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కహానీ? నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో……
ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే…. అబ్బా… ఇప్పుడొద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటూ ఎక్కడలేని సణుగుళ్ళూ సణిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట. పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలుపెట్టేశారట. అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం…. ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉందట. ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయిన ఆ పదవి ఏది? ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగిపోయింది? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట. ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు…
రెండు విడతలుగా పోటీకి దూరంగా ఉంటున్నా…, పార్టీ కోసమే ప్రచారం చేస్తున్నా….. ఆ సీనియర్ లీడర్ని టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీల్ని సైతం మర్చిపోయిందా? అందరికీ పదవులు ఇస్తున్నా… ఆయన్ని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు? స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఎందుకు అమలవడం లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ల్యాగింగ్ స్టోరీ? వంగవీటి రాధా…మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు…
ఆ నియోజకవర్గంలో మర్డర్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయా? కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు హత్యలదాకా వెళ్ళిందా? పొలిటికల్ పైచేయి కోసం ఖద్దర్, ఖాకీ ఒక్కటయ్యాయా? చనిపోయిన నాయకుడు, చంపినట్టు ఆరోపణలున్న నాయకుడు సొంత మామా అల్లుళ్ళే అయినా….. పొలిటికల్ పవర్ ముందు బంధం బలాదూర్ అయిందా? ఎక్కడ జరిగిందా హత్య? కాంగ్రెస్ని ఎలా షేక్ చేస్తోంది? సూర్యాపేట జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ హత్య హస్తం పార్టీలో కుంపటి రాజేసింది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా అంటుకోవడం మరింత…