Off The Record: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా జనసమీకరణ కోసం టార్గెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లీనరీ సక్సెస్ కోసం గులాబీ అధిష్టానం స్పెషల్ స్కెచ్ వేసిందా? పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా…. జన సమీకరణ విషయంలో డౌట్స్ ఉన్నాయా? అందుకే పార్టీ నాయకులకు బంపరాఫర్ ప్రకటించేసిందా? చెప్పాల్సింది చెప్పేసి… ఇక మీ ఇష్టం…. మీ సత్తా…. నిరూపించుకోండని వదిలేసిందా? వరంగల్ గ్రౌండ్ నింపేందుకు బీఆర్ఎస్ పెద్దలు పెట్టిన స్కీమ్ ఏంటి? టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? అధికారంలో లేకున్నా డోంట్ మైండ్… పార్టీ రజతోత్సవ వేడుకల్ని మాత్రం గ్రాండ్గా నిర్వహించాలని డిసైడైందట బీఆర్ఎస్ అధిష్టానం. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభతో కార్యక్రమాలు మొదలై ఏడాది పొడవునా జరుగుతాయని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ఓరుగల్లు సభను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలగా ఉన్నారట గులాబీ పెద్దలు. దాదాపు నెల నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుండగా… పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు గులాబీ దళపతి. ఇక జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందట బీఆర్ఎస్ అధిష్టానం. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఈ సభలో ప్రాతినిధ్యం ఉండాలని అనుకుంటున్నట్టు సమాచారం. భారీ ఎత్తున జనాన్ని తరలించి సత్తా చాటాలనుకుంటున్నారట. అయితే… ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలుగాని, ఆ వాతావరణంగాని లేనందున… జన సమీకరణ అంత తేలికైన పని కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట పార్టీలో. మామూలుగా దగ్గర్లో ఎన్నికలుంటే ఆశావహులో… లేదా అధికారంలో ఉంటే అంతా కలిసో జనాన్ని తరలిస్తారుగానీ….. ఆ రెండూ లేనప్పుడు సమీకరణ కష్టమైన వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. అందుకే కాస్త డిఫరెంట్గా ఆలోచించిన పార్టీ పెద్దలు… ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిదాకా అన్ని కమిటీలను వేస్తామని ప్రకటించారు.
దీని ద్వారా నాయకుల మధ్య పోటీ పెట్టి ఎక్కువ జన సమీకరణ జరిగేలా చూడాలన్నది ప్లాన్ అట. వరంగల్ బహిరంగ సభకు ఎంత ఎక్కువ మందిని తరలిస్తే… అంత పెద్ద పదవి ఇస్తామని అంతర్గతంగా చెప్పినట్టు సమాచారం. అంటే… పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కాలంటే…. లారీలకు లారీల జనాన్ని తోలాల్సి ఉంటుందన్న మాట. ఇట్స్ యువర్ టైం. మీ సత్తా చూపించే సమయం వచ్చేసింది. జనాన్ని తరలించండి….అంటూ టార్గెట్స్ పెట్టారట గులాబీ పెద్దలు. మీ పదవికి మీరు తీసుకొచ్చే జనమే ప్రామాణికం అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా… నాయకులు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే సమయంలో కొందరికి స్పెషల్ టార్గెట్స్ కూడా పెట్టారట. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మందికి తగ్గకుండా తీసుకురావాలని చెప్పినట్టు తెలిసింది. ఇక ఎమ్మెల్యేలు లేకుండా ఇన్చార్జ్లు ఉన్నచోట నాలుగు నుంచి 5 వేల మందిని తరలించాలన్నది లక్ష్యం అట. అలా… అంతా కలిపి 10 లక్షల మందిని సమీకరించాలన్నది టార్గెట్గా తెలుస్తోంది. అయితే… పైకి పది లక్షలని గొప్పగా చెబుతున్నా… ఫైనల్గా రెండు లక్షల మంది వచ్చినాసరే… సభ గ్రాండ్ సక్సెస్ అన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందు పెద్ద టార్గెట్స్ పెడితేనే చివరికి అనుకున్న స్థాయికి జన సమీకరణ జరుగుతుందన్నది పెద్దల లెక్కగా తెలిసింది. ఈనెల 27న నిర్వహించబోయే బహిరంగ సభ తమకు చావో రేవోనని అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. ఫైనల్గా ఎవరు ఎంత మందిని తరలిస్తారో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!