రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు…
కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ…
5 లక్షల మంది, 6600 బస్సులు: ఏపీ రాజధాని అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ గంటా 25 నిమిషాలు పాటు ఉండనుంది. 58 వేల కోట్ల విలువైన పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోడీ చేతుల మీద జరగనున్నాయి. అమరావతి పునఃనిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా…
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతంగా ఉందనే భావన పెరిగింది. అది నిజం కాదని నిరూపిస్తూ.. పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. కనీవినీ ఎరుగని ఘటనతో.. దేశం ఉలిక్కిపడింది. ఉగ్రదాడికి రూపకల్పన చేసిన పాకిస్తాన్ కు మరిచిపోలేని గుణపాఠం చెప్పాలనే డిమాండ్ పెరుగుతోంది. కశ్మీర్ మారిందనే ప్రచారం అబద్ధమని నిరూపించటమే ధ్యేయంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. తాపీగా నడుచుకుంటూ వచ్చి పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అంతే తేలికగా పరారయ్యారు. గతంలో ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్ తో బుద్ధి…
బెయిల్పై విడుదలైన గోరంట్ల మాధవ్: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో…
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి: ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ.. నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తదితర ఇతర…
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 నుండి 50…
తెలంగాణ బీజేపీ అనుకున్నది సాధించగలిగిందా? ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్లో వేరే పార్టీ సభ్యుల ఓట్లు కమలానికి పడ్డాయా? ఉన్నబలంకంటే ఒక్కటి రెండు ఓట్లు ఎక్కువ సాధించినా సక్సెస్ అయినట్టేననన్న కాషాయ దళం ఆశలు నెరవేరే అవకాశ ఉందా? ఈ విషయమై ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది. శుక్రవారంనాడు ఫలితం వస్తుంది. ఈ క్రమంలో బీజేపీ ఆడిన మైండ్ గేమ్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఆ పార్టీ అనుకున్నది…
అధికారం కోల్పోయాక అక్కడ గులాబీ దళంలో వర్గ పోరుకు బీజం పడిందట. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం ఆకర్ష మంత్రం జపిస్తుండటం కేడర్ను ఇరకాటంలో పెడుతోందట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టే టార్గెట్గా పావులు కదుపుతున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఏ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే స్కెచ్లేస్తున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్నగర్ గులాబీ నేతల తీరుపై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా, ఎలా ఉన్నా…
అక్కడ టీడీపీ శాసనసభ్యులకు అసలు మేం ఎమ్మెల్యేలమో కాదోనన్న అనుమానం వస్తోందా? పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా వాళ్ళలో లేకుండా పోయిందా? ఇదెక్కడి ఖర్మరా… బాబూ.. అంటూ తలలు కొట్టుకుంటున్నారా? పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఇలాగే ఏడిశాయని ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకొచ్చిన కష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి కూటమి పవర్లోకి వచ్చాక అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యారట ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు. ఏం……