విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…
తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చారన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు…
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు…
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా తరలి రానున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు.. నందమూరి జయకృష్ణ, గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు, నందమూరి మాధవి మణి సాయికృష్ణ, లక్ష్మి హరికృష్ణ ,నందమూరి మోహన కృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి,…
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే.. చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ.. గత కొన్నేళ్లుగా ప్రతీ నెల సోషల్ మీడియాలో.. వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మేల్, ఫీమేల్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది. మరి ఈ సర్వేలో ఎవరు నెంబర్ ప్లేస్లో నిలిచారు..? ఓర్మాక్స్…
మహానటుడు ఎన్టీయార్ కేవలం నటనకే పరిమితం కాలేదు. చిత్ర నిర్మాణంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఎన్.ఎ.టి., ఆర్కే ఎన్.ఎ.టి., రామకృష్ణ సినీ స్టూడియోస్, తారకరామ ఫిల్మ్ యూనిట్, రామకృష్ణ హార్టీ కల్చరల్ స్టూడియోస్, శ్రీమతి కంబైన్స్ వంటి పతాకాలపై పలు చిత్రాలు నిర్మించారు. ఆయన నట వారసుడు బాలకృష్ణ ఎన్.బి.కె. బ్యానర్ పైన ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మించారు. అలానే హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో పలు చిత్రాలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మోషన్ టీజర్ రిలీజ్ చేసి.. అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు కొరటాల. అయితే…
ఆ యంగ్ టాలెంట్ ఏం చేసినా.. ఎలాంటి ట్యూన్ ఇచ్చినా.. సెన్సేషనల్గా నిలుస్తుంది. పైగా ఆచార్యతో డీలా పడిపోయిన కొరటాల.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్తో సాలిడ్ హిట్ కొట్టేందుకు కసిగా ఉన్నాడు. అందుకే ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్-కొరటాల శివ.. మాస్ ఆడియెన్స్ను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఎన్నో మాస్ బీట్స్తో రచ్చ లేపిన అనిరుధ్.. ఈ సారి ఎన్టీఆర్ కోసం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి ఆ మాస్ బీట్ ఎలా ఉండబోతోంది..?…