Balakrishna: తెలుగు వెలుగు ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని జరుపుకుంటున్నాం.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఈ భూమి మీద ఎంతోమంది పుడతారు. ఆయన శత పురుషుడు. తెలుగు ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా బెదరక, చెదరక, తలవంచక ముందుకు సాగారు. అత్యున్నత శిఖరాలకు చేరాలంటే కష్టపడాలి. నీ దారిలో నీవు నడవాలని నాన్నగారు నాకు నేర్పారు. తెలుగు వెలుగు నందమూరి తారకరామారావు. అన్నీ అనుకూలించి మహత్తర ముహూర్తంలా పార్టీని స్థాపించారు. సినీజగత్తులో కోట్లాదిమంది అభిమానం చాటుకున్నారు. ఆయన పటాన్ని పూజాగదిలో పెట్టుకున్నారు. ఆయన రూపాన్ని గుండె గదిలో పెట్టుకున్నారు.
ఈ మూడేళ్లల్లో ధరలు పెరిగాయి.. అన్ని రకాల ఛార్జీల రేట్లు పెంచేశారు.దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టొయ్ అనే రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుది.మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు చంద్రబాబు.ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు.టీడీపీని అధికారంలోకి తెస్తేనే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుంది.
టీడీపీకి ప్రజాశీస్సులు ఇవ్వాలి.తెలుగు వారు కాని వారు కూడా తెలుగోళ్లను గుర్తు పట్టేలా చేసిన ఘనత ఎన్టీఆరుదే.ఓటంటే నోటు కాదు. గుడినే కాదు గుళ్లో లింగాన్ని కూడా మింగేసేవాళ్లున్నారు. నువ్వు-నేను కలిస్తే మనం.. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం.ఇప్పుడు మహానాడు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది.శత పురుషుడి శత జయంతి జరుపుకుంటున్నాం.పేదొడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని తపించేవారు ఎన్టీఆర్.ఎన్టీఆర్ పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయన్నారు బాలయ్య.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!