ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు.
Nizamabad Govt Hospital Boy Kidnap Update: నిజామాబాద్ జిల్లా కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో కిడ్నాప్కు గురైన మూడేళ్ల బాలుడు అరుణ్ ఆచూకిని పోలీసులు కనుగొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. పోలీసులు బాలుడిని అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్ల నుంచి రక్షించిన పోలీసులకు అరుణ్ తండ్రి సాయినాథ్ ధన్యవాదాలు తెలిపాడు. కుమారుడు మళ్లీ తమ దగ్గరికి వస్తాడనుకోలేదని…
Nizamabad Crime: నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్,శైలజ (యువ జంట) ఆత్మహత్య కేసులో మృతురాలి పిన్నిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు.
Lok Sabha Results 2024: 5వ రౌండ్: నిజామాబాద్ జిల్లాలో 5వ రౌండ్ ముగిసే సరికి 38500 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో వున్నారు.