Off The Record: నిజామాబాద్ కారు పార్టీలో కొత్త చిచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో కొత్త చిచ్చు రేగుతోందట. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నేతల మధ్య మనస్పర్థల్ని పెంచుతోందంటున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని కొత్తగా కో ఆర్డినేటర్స్ని నియమించడం సమస్యకు మూల కారణం అంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్లో పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోందట. నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి జంప్ల మీద జంప్లు కొడుతున్నా…. ఇన్ఛార్జ్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకోవడం లేదని, పైగా కేడర్కు అసలు అందుబాటులో ఉండటం లేదని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లిట్టు తెలిసింది. అందుకే వాళ్ళకు సమాంతరంగా కొత్తగా కో ఆర్డినేటర్స్ని నియమించారన్నది ఒక వెర్షన్. మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరు విదేశాల్లో ఉంటే, మరొకరు వివాదాల్లో బిజీగా ఉన్నారట. ఇంకొందరు హైదరాబాద్ వదిలి రావడంలేదన్నది కేడర్ మాట.
ఏదో… నియోజకవర్గానికి రాకపోతే బాగుండదన్నట్టుగా గుర్తుకు వచ్చినప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప ఎన్నికల ప్రచారాన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్నది ప్రధానమైన అభియోగం. దీంతో…. సమన్వయకర్తల రూపంలో ఇన్ఛార్జ్లకు చెక్పెట్టే ఆలోచన చేసిందట హైకమాండ్. ఆ క్రమంలోనే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలను ప్రకటించారు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించింది అధినాయకత్వం. అయితే కో ఆర్డినేటర్ల దగ్గరే మొత్తం తేడా కొడుతోందన్నది బీఆర్ఎస్ వర్గాల మాట. కో ఆర్డినేటర్స్లో ఆర్మూర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎల్ రమణ మినహా మిగతా ఎవ్వరూ పెద్ద స్థాయి నాయకులు కాదని, తాము ఉన్నచోట వాళ్ళ పెత్తనం ఏంటని మండి పడుతున్నారట సీనియర్స్. అదే సమయంలో అంతకు మించిన మరో పెద్ద సమస్య కూడా వస్తున్నట్టు తెలిసింది. సమన్వయకర్తలవల్లే అసలు సమన్వయం అన్నది లేకుండా పోతోందని, అది పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు తలనొప్పులు పెంచుతోందని అంటున్నారు.
Also Read
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
ఈనెల 19న నామినేషన్ వేశారు గోవర్ధన్. తర్వాత పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ జరిగింది. అయితే.. ఈ కార్యక్రమానికి జన సమీకరణ బాధ్యత ఎవరిదన్న గందరగోళం వచ్చిందట. ఇన్ఛార్జ్, కో ఆర్డినేటర్లో ఎవరికి బాధ్యత అప్పగించాలో తెలియక తలలు పట్టుకున్నట్టు తెలిసింది. అంతేకాదు… ఖర్చులు ఎవరు భరించాలి? ఎవరి చేతికి డబ్బులు ఇవ్వాలనే విషయంలో కన్ఫ్యూజ్ అయినట్టు తెలిసింది. ఈ కంగాళీ కారణంగా ఎవరూ సరిగా బాధ్యత తీసుకోకపోవడంతో సభకు జనం కూడా ఆశించిన స్థాయిలో రాలేదన్నది పార్టీ వర్గాల సమాచారం. దాంతో… వచ్చిన వాళ్ళతోనే మమ అనిపించారట. దీనికి తోడు సభా వేదికపై సమన్వయ కర్తలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ లుకలుకలు మొదలైనట్టు తెలిసింది. నామినేషన్ల పక్రియ పూర్తై.. ప్రచారం ఊపందుకునే సమయంలో పార్టీ అధిష్టానం చేసిన సమన్వయకర్తల ప్రయోగం కొత్త సమస్యలకు తెరలేపిందని గులాబీ వర్గాలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. దశాబ్దం పాటు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఓడిపోయిన నేతలు.. కో ఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోలేకపోతున్నారట. మేమేంది… మా సీనియారిటీ ఏంది? మీరా మాకు చెప్పేది.. అంటూ లైట్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇలా సమన్వయకర్తతోనే సమన్వయం కరువై అసలుకే ఎసరొస్తుందన్న ఆందోళన గులాబీ కేడర్లో పెరుగుతోందంటున్నారు. మరి మార్పు మంచిదా? లేక ముంచేదా అన్న సంగతి తేలాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!