ACB Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం..
- ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో తీవ్ర కడుపునొప్పితో విద్యార్థి మృతి చెందిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో ఆహారంతోపాటు సౌకర్యాలపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులకు అందజేస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను పరిశీలించారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడం లేదన్న ఫిర్యాదులపై కొంతకాలంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Read also: Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..
Also Read
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్ లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్ లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారిస్తున్నారు.
Read also: Thummala Nageswara Rao: నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవే..
రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు.. ర్యాండం సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టారు. హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్నారు.
Revanth Reddy: నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!