ACB Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం..
- ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో తీవ్ర కడుపునొప్పితో విద్యార్థి మృతి చెందిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో ఆహారంతోపాటు సౌకర్యాలపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులకు అందజేస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను పరిశీలించారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడం లేదన్న ఫిర్యాదులపై కొంతకాలంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Read also: Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్ లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్ లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారిస్తున్నారు.
Read also: Thummala Nageswara Rao: నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవే..
రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు.. ర్యాండం సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టారు. హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్నారు.
Revanth Reddy: నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!