బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక…
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని…
కరోనా పోవాలి.. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి.. అన్ని పండులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు.. అయితే, కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపిన ఆమె.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని..…
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి…
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజమాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 1లక్ష 69వేళా క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 32 గేట్ల ద్వారా 1లక్ష 49 వేళా క్యూస్సేక్కులకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. విద్యుత్ ఉత్పత్తి కి కాకతీయ ద్వారా 7500 క్యూస్సేక్కులు… సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు.. అలాగే లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూస్సేక్కులు… వరద కాలువ ద్వారా 9700 క్యూస్సేక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు…
దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకొంది. మైనర్ ఆడపిల్లలకు చాక్లెట్ల పేరుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఇచ్చి ముద్దులు ఇవ్వాలంటూ మైనర్ బాలికలపై రవీందర్ కామంతో పైశాచిక ఆనందం పొందుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని సాయినగర్ లో గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతుండగా.. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన…
నామినేటెడ్ పదవులు ఆ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతున్నాయా? పోస్ట్లను అనుచరులకు కట్టబెట్టేందుకు చేస్తున్న లాబీయింగే గొడవ రాజేస్తోందా? ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య కాకరేపుతున్న రెండు పదవులు. వానిపైనే పార్టీవర్గాల్లో ఆసక్తికర చర్చ. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. రెండు పదవుల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల కుస్తీ! తెలంగాణలో నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుందన్న చర్చ జరుగుతున్న తరుణంలో.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు చర్చగా మారాయి. తమనే నమ్ముకుని ఉన్న…
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, తన సోదరుడు డి. సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అరవింద్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంక్ లకు నేను దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరు. .డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారు అని ఆరోపించిన ఆయన.. రేవంత్రెడ్డి తన కోపాన్ని…
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని…
అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్చుప్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు! తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన…