CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు.
AP Assembly: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు అవుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను గత ఏడాది జూలైలో చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టింది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 - 26కి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్న సీఎం చంద్రబాబు.. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదు.. పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు: సీఎం చంద్రబాబు
Minister Sandhya Rani: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడింది. పిచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ గా మారటమే జగన్ 2.0 అని పేర్కొంది. శవం లెగిస్తే కానీ బయటకు రాని దుర్మార్గుడు జగన్.. విజయమ్మ, షర్మిలా ఆయుష్షు గట్టిది కాబట్టే అతడికి దూరంగా ఉంటున్నారు.
Alapati Rajendra Prasad: గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు.
Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవ్ ను శాలువతో సత్కరించారు లోకేశ్. ఇక, ఏపీ మంత్రి వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్ తో పాటు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తాం.. వచ్చే విద్య సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్లు కూడా అంతజేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తెస్తామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా…
ఎన్డీఏపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ కోసం పని చేశారు.. పార్టీ కోసం ఎంతో కష్ట పడిన సీతారాం ఏచూరిని కోల్పోయాం.. నెల్లూరులో పార్టీకి చెందిన వైద్యులు ఏర్పాటు చేసిన ఆసుపత్రి కి వచ్చాను.. నెల్లూరులో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను…
Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక నేతల వరకూ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.