CPI Ramakrishna: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి..
- రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై భేటీ..
- గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్..
- ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరిన సీపీఐ రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి.. తప్ప బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు జరపటం లేదని ఎద్దేవా చేశారు. ఈ సారి బడ్జెట్ లో ప్రాజెక్టులను పూర్తి చేయటం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా సహకారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దూకుడు..
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఇక, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నాలుగు అంశాలపై ప్రధానంగా సమావేశంలో తీర్మానాలు చేశాం అన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఉన్నాయి.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీల నీరు ఏపీకి ఉంచాలి.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలి అని డిమాండ్ చేశారు. 10 వేల కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కోరారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని గొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలి అని సూచించారు. అక్కడి నుంచి సోమశిల మీదుగా పెన్నాకు అనుసంధానం చేయాలన్నారు. బనకచర్లకు గోదావరి అనుసంధానం అనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా మా అభిప్రాయాలను సమర్థించారు.. కూటమి ప్రభుత్వం గోదావరి, బనకచర్ల అనే నిర్ణయం విడనాడాలి అని చెప్పుకొచ్చారు. భవిష్యత్తు లో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి.. ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం కూడా ఉంది.. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని లక్ష్మీ నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!