Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
CM KCR: సీఎం కేసీఆర్ మహరాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి.
ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు.
అజిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్ పవార్పై విరుచుకుపడ్డారు. 'రిటైర్' అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్ అలాగే మిగిలి ఉందని అన్నారు.
Uddhav Thackeray: మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు.
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పరిణామాలు మహారాష్ట్రలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తారు.
NCP Poster War: అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన తన మామ శరద్ పవార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా పార్టీ పేరు, చిహ్నంపై దావా వేశారు.
మహారాష్ట్రలో ఎన్సీబీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించడానికి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో అజిత్ పవార్ శిబిరం సమావేశం జరుగుతుండగా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శిబిరం సమావేశం ముంబైలోని వైబీ చవాన్ సెంటర్లో జరుగుతోంది.
NCP Crisis: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) రాజకీయంలో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా వ్యవహారం నడుస్తోంది. ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. అజిత్ పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరారు. ఆయన ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మరో 8మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు.