INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఇండియా కూటమి 13 మంది సభ్యుల సమన్వయ ప్యానెల్లో కింది వారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్వాదీ పార్టీ నుంచి జావేద్ ఖాన్, జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర సమన్వయ కమిటీలో ఉన్నారు. కోఆర్డినేషన్ ప్యానెల్ లీడర్ను ఇంకా ప్రకటించలేదు.
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
సమావేశం సందర్భంగా విడుదల చేసిన తీర్మానంలో సభ్య పార్టీలు సాధ్యమైనంత వరకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇండియా కూటమి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించబడతాయని తెలిపింది. మొత్తం సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా సీట్ల పంపకం చర్చలు ముగుస్తాయని కూడా తీర్మానంలో పేర్కొంది.
Read Also: CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..
అంతకుముందు రోజు సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి ప్రాబల్యం పొందుతున్నందున ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై ఏజెన్సీలను ఎక్కువగా దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు, అట్టడుగువర్గాలు, మధ్యతరగతి, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులతో సహా సమాజంలోని ప్రతి వర్గమూ బీజేపీ నిరంకుశ పాలనతో నష్టపోయామని ఖర్గే అన్నారు. అమాయక రైలు ప్రయాణికులు, పాఠశాల పిల్లలపై ద్వేషపూరిత నేరాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.ప్రగతిశీల, సంక్షేమ ఆధారిత, సమ్మిళిత భారతదేశం కోసం తాము ఐక్యంగా ఉన్నామని కూటమిని ఉద్దేశిస్తూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణ కౌంట్డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు.
Also Read: Karnataka Ministers: కర్ణాటక మంత్రులకు అత్యాధునిక కార్లు.. 33 కార్ల కొనుగోలుకు సర్కార్ నిర్ణయం
కూటమి మూడో సమావేశాన్ని ప్రచార వ్యూహాన్ని రూపొందించడానికి, ప్రతిపక్ష కూటమి అధికారిక నిర్మాణాన్ని ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం తర్వాత విపక్ష నేతలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కూటమి కనీసం నాలుగు ఉప సమూహాలను ఏర్పాటు చేసి, ఒక్కొక్కటి వేర్వేరు బాధ్యతలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కూటమి ఉమ్మడి ఎజెండాకు ఒక గ్రూపు, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం, సోషల్ మీడియాను నిర్వహించడంపై మరొక బృందం, పరిశోధనతో పాటు డేటా విశ్లేషణపై మరొక బృందం ఉంటుంది. ఉమ్మడి ప్రచారం, ర్యాలీల కోసం మరొక సబ్కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు.ఉమ్మడి ఎజెండా రూపొందించేందుకు బుల్లెట్ పాయింట్లను సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతలను కోరారు. అధికార ప్రతినిధి నియామకంపై కూటమి నిర్ణయం తీసుకోనుంది. భారత కూటమిలోని సభ్యుల మధ్య సజావుగా సమన్వయం కోసం కొత్త సచివాలయాన్ని కూడా సమావేశంలో ప్రకటించనున్నారు. దేశ రాజధానిలో సచివాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!