INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఇండియా కూటమి 13 మంది సభ్యుల సమన్వయ ప్యానెల్లో కింది వారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్సీపి చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్వాదీ పార్టీ నుంచి జావేద్ ఖాన్, జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర సమన్వయ కమిటీలో ఉన్నారు. కోఆర్డినేషన్ ప్యానెల్ లీడర్ను ఇంకా ప్రకటించలేదు.
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
సమావేశం సందర్భంగా విడుదల చేసిన తీర్మానంలో సభ్య పార్టీలు సాధ్యమైనంత వరకు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఇండియా కూటమి పేర్కొంది. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లు తక్షణమే ప్రారంభించబడతాయని తెలిపింది. మొత్తం సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా సీట్ల పంపకం చర్చలు ముగుస్తాయని కూడా తీర్మానంలో పేర్కొంది.
Read Also: CPI Narayana: ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..
అంతకుముందు రోజు సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి ప్రాబల్యం పొందుతున్నందున ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై ఏజెన్సీలను ఎక్కువగా దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు, అట్టడుగువర్గాలు, మధ్యతరగతి, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులతో సహా సమాజంలోని ప్రతి వర్గమూ బీజేపీ నిరంకుశ పాలనతో నష్టపోయామని ఖర్గే అన్నారు. అమాయక రైలు ప్రయాణికులు, పాఠశాల పిల్లలపై ద్వేషపూరిత నేరాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.ప్రగతిశీల, సంక్షేమ ఆధారిత, సమ్మిళిత భారతదేశం కోసం తాము ఐక్యంగా ఉన్నామని కూటమిని ఉద్దేశిస్తూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణ కౌంట్డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యానించారు.
Also Read: Karnataka Ministers: కర్ణాటక మంత్రులకు అత్యాధునిక కార్లు.. 33 కార్ల కొనుగోలుకు సర్కార్ నిర్ణయం
కూటమి మూడో సమావేశాన్ని ప్రచార వ్యూహాన్ని రూపొందించడానికి, ప్రతిపక్ష కూటమి అధికారిక నిర్మాణాన్ని ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం తర్వాత విపక్ష నేతలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కూటమి కనీసం నాలుగు ఉప సమూహాలను ఏర్పాటు చేసి, ఒక్కొక్కటి వేర్వేరు బాధ్యతలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కూటమి ఉమ్మడి ఎజెండాకు ఒక గ్రూపు, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం, సోషల్ మీడియాను నిర్వహించడంపై మరొక బృందం, పరిశోధనతో పాటు డేటా విశ్లేషణపై మరొక బృందం ఉంటుంది. ఉమ్మడి ప్రచారం, ర్యాలీల కోసం మరొక సబ్కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు.ఉమ్మడి ఎజెండా రూపొందించేందుకు బుల్లెట్ పాయింట్లను సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతలను కోరారు. అధికార ప్రతినిధి నియామకంపై కూటమి నిర్ణయం తీసుకోనుంది. భారత కూటమిలోని సభ్యుల మధ్య సజావుగా సమన్వయం కోసం కొత్త సచివాలయాన్ని కూడా సమావేశంలో ప్రకటించనున్నారు. దేశ రాజధానిలో సచివాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..