Sharad Pawar: మాయవతి ఏ వైపు ఉందో క్లారిటీ లేదు.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ప్రశ్నార్థకంగా ఉందని, ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుందనే ఊహాగానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బుధవారం అన్నారు. రేపు ముంబయిలో ప్రారంభం కానున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో శరద్పవార్ మాట్లాడుతూ.. తాను తటస్థంగా ప్రకటించుకున్న మాయావతిపై కూటమి వైఖరి గురించి అడిగారు.
Also Read: Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్పై కేంద్ర మంత్రి
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
“మాయావతి ఎవరితో ఉన్నారనే దానిపై ఒక ప్రశ్న ఉంది. ఆమె బీజెపీతో ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. నేను అది నిజమని చెప్పడం లేదు, కానీ దానిపై స్పష్టత రావాలి” అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇండియా కూటమి లేదా ఎన్డీయేతో ఎలాంటి పొత్తు లేదని మాయావతి పేర్కొనడంతో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతి ఒక్కరూ తమ పార్టీతో పొత్తుపై ఆసక్తి చూపుతున్నారని, తాను నిరాకరించగా ప్రతిపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నాయని మాయావతి అన్నారు.దేశంలోని రెండు కూటములు ఎక్కువగా పేదల వ్యతిరేక, కులతత్వ, వర్గ, పెట్టుబడిదారీ విధానాలతో కూడిన పార్టీలను కలిగి ఉన్నాయని బీఎస్పీ చీఫ్ మాయావతి గతంలో ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఇవి తమ పార్టీ పోరాడుతున్న విధానాలేనని ఆమె అన్నారు.
2007లో లాగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన కోట్లాది మంది సభ్యులను ఏకం చేయడం ద్వారా రాబోయే లోక్సభ, నాలుగు రాష్ట్రాలవ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది బీఎస్పీ చీఫ్ పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల తర్వాత మాయావతి సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు స్వస్తి పలికారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!