Sharad Pawar: అజిత్ పవార్ సీఎం కావడం ఎప్పటికీ కలగానే మిగులుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన శివసేన, ఎన్సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఈ రెండు చీలిక వర్గాలు బీజేపీతో ప్రభుత్వాన్ని పంచుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ని కాదని అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ తో పాటు శరత్ పవార్ నమ్మినబంట్లుగా పేరున్న నేతలు కూడా అజిత్ వర్గంలోనే ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యే ఈ వర్గంతోనే జతకట్టారు.
ఇదిలా ఉంటే గురువారం అజిత్ పవార్ గురించి శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ ఎప్పటికీ మహరాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. అది కలగానే మిగులుతుందని చెప్పారు. మీడియాతో మాట్లాడిన ఆయన..దేశంలో 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన లేదని, మహారాష్ట్రలో కూడా అధికారం కోల్పోతుందని జోస్యం చెప్పారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Israel: సిరియాపై ఇజ్రాయిల్ దాడి..2 ఎయిర్పోర్టులు ధ్వంసం.
ఈ ఏడాది జూలై నెలలో ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా ఏర్పడింది. శివసేన(ఏక్నాథ్ షిండే)- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వర్గంలోకి మరికొంత మంది మంత్రి పదవులను స్వీకరించారు.
శరద్ పవార్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 70 శాతం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అజిత్ పవార్ వర్గంలో ఉన్న ఛగన్ భుజ్బల్ ఒకసారి సుప్రియా సూలేను ఎన్సీపీ అధ్యక్షురాలిగా చేయాలని ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించారని, అయితే ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ వర్గంలో ఉన్నారని శరద్ పవార్ అన్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!