Sharad Pawar: బీజేపీతో వెళ్లే ప్రసక్తే లేదు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
ఈ రోజు జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ.. అంతకుముందు డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. నా పార్టీ కార్యకర్తలు గందగగోళంలో ఉన్నారని తానున అనుకోనని శరద్ పవార్ అన్నారు. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ సమయంలో శివసేన పొత్తు నుంచి వైదొలిగే సమయంలో, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
Read Also: Rahul Gandhi: అమ్మ సోనియాకు రాహుల్ గాంధీ సర్ప్రైజ్ గిఫ్ట్..
2024 ఎన్నికల గురించి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని శరద్ పవార్ అన్నారు. ఈ రోజు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ఇది కేజ్రీవాల్ పై ప్రతీకరా చర్య అని పవార్ విమర్శించారు. బీజేపీతో పడని నేతలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈడీ చర్యలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఒక తాటిపైకి తీసుకువస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?