Pawars Secret Meeting: బాబాయ్, అబ్బాయ్ల రహస్య భేటీపై కాంగ్రెస్ ఆందోళన.. సుప్రియా సూలే స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawars Secret Meeting: ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ లేదా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియా కథనంపై స్పందిస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని సుప్రియా సూలే చెప్పారు. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ఆమె.. ఆ పార్టీ నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ.. “నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. ఆ తరహాలో నాతో ఎవరూ సంభాషణలు జరపలేదు. మీరు అలాంటి ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారని మీరు వారిని (మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులను) అడగాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గౌరవ్ గొగోయ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో వ్యక్తిగతంగా టచ్లో ఉన్నాను. కానీ మహారాష్ట్రలోని వారి నాయకులతో ఎవరితోనూ టచ్లో లేను.” అని ఆమె అన్నారు.
Read Also: Miheeka Bajaj: మ్యాగజైన్ కవర్ పై రానా భార్య.. హీరోయిన్లు సైతం దిగదుడుపే
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
అంతకుముందు బుధవారం, కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ.. శరద్ పవార్, పార్టీ ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న అజిత్ పవార్ మధ్య ఇటీవల జరిగిన సమావేశాన్ని ప్రశ్నించారు. అజిత్ పవార్ 8 మంది విధేయ ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో ఎన్సీపీలో చీలికను సృష్టించారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రత్యర్థి వర్గం రాష్ట్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వంలో చేరింది.అజిత్ పవార్ను మహారాష్ట్ర సీఎంగా చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టారని, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరడానికి తన బాబాయిని ఒప్పించాలని కోరినట్లు వడెట్టివార్ ఆరోపించారు. “అజిత్ పవార్ శరద్ పవార్ను ఎందుకు తరచుగా కలుస్తున్నారు?. రెండు పార్టీల (ఎన్సీపీ, శివసేన) చీలిక తర్వాత కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. శరద్ పవార్ మాస్ లీడర్ కావడంతో వారు శరద్ పవార్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయన సహాయం లేకుండా వచ్చే ఏడాది బీజేపీ రాష్ట్రం నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోదు” అని విజయ్ వడెట్టివార్ అన్నారు.
Read Also: Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బుధవారం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు, సోమవారం నాడు, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే పుణెలో జరిగిన రహస్య సమావేశం గురించి డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శరద్పవార్పై విరుచుకుపడ్డారు. ఇటువంటి సమావేశాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమావేశాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, బంధువులైతే రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్వయంగా ఎన్డీఏలోకి మారతారనే ఊహాగానాలు చెలరేగాయి. అజిత్ పవార్తో ఆయన భేటీ తర్వాత ఈ ఊహాగానాలు పుంజుకున్నాయి. నివేదించబడినట్లుగా ఇది రహస్య సమావేశం కాదని చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలను కాంగ్రెస్ గమనిస్తోందని, ముంబైలో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని పటోలే తెలిపారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిగాయని.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై ఓ కన్నేసి ఉంచిందని, ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశంలో ఈ విషయం కూడా చర్చకు రానుందని ఆయన చెప్పారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఇండియా) బ్యానర్తో కూడిన ఉమ్మడి ప్రతిపక్ష నాయకులు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీలలో ముంబైలో తమ మూడో సమావేశాన్ని నిర్వహించబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు ముందుగా తెలిపాయి.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!