Pawars Secret Meeting: బాబాయ్, అబ్బాయ్ల రహస్య భేటీపై కాంగ్రెస్ ఆందోళన.. సుప్రియా సూలే స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawars Secret Meeting: ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ లేదా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియా కథనంపై స్పందిస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని సుప్రియా సూలే చెప్పారు. కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ఆమె.. ఆ పార్టీ నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ.. “నాకు అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. ఆ తరహాలో నాతో ఎవరూ సంభాషణలు జరపలేదు. మీరు అలాంటి ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారని మీరు వారిని (మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులను) అడగాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గౌరవ్ గొగోయ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులతో వ్యక్తిగతంగా టచ్లో ఉన్నాను. కానీ మహారాష్ట్రలోని వారి నాయకులతో ఎవరితోనూ టచ్లో లేను.” అని ఆమె అన్నారు.
Read Also: Miheeka Bajaj: మ్యాగజైన్ కవర్ పై రానా భార్య.. హీరోయిన్లు సైతం దిగదుడుపే
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
అంతకుముందు బుధవారం, కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ.. శరద్ పవార్, పార్టీ ప్రత్యర్థి వర్గానికి నాయకత్వం వహిస్తున్న అజిత్ పవార్ మధ్య ఇటీవల జరిగిన సమావేశాన్ని ప్రశ్నించారు. అజిత్ పవార్ 8 మంది విధేయ ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో ఎన్సీపీలో చీలికను సృష్టించారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రత్యర్థి వర్గం రాష్ట్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వంలో చేరింది.అజిత్ పవార్ను మహారాష్ట్ర సీఎంగా చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టారని, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరడానికి తన బాబాయిని ఒప్పించాలని కోరినట్లు వడెట్టివార్ ఆరోపించారు. “అజిత్ పవార్ శరద్ పవార్ను ఎందుకు తరచుగా కలుస్తున్నారు?. రెండు పార్టీల (ఎన్సీపీ, శివసేన) చీలిక తర్వాత కూడా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. శరద్ పవార్ మాస్ లీడర్ కావడంతో వారు శరద్ పవార్ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయన సహాయం లేకుండా వచ్చే ఏడాది బీజేపీ రాష్ట్రం నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోదు” అని విజయ్ వడెట్టివార్ అన్నారు.
Read Also: Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం బుధవారం ముంబైలో జరుగుతోంది. అంతకుముందు, సోమవారం నాడు, కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే పుణెలో జరిగిన రహస్య సమావేశం గురించి డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శరద్పవార్పై విరుచుకుపడ్డారు. ఇటువంటి సమావేశాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సమావేశాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, బంధువులైతే రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్వయంగా ఎన్డీఏలోకి మారతారనే ఊహాగానాలు చెలరేగాయి. అజిత్ పవార్తో ఆయన భేటీ తర్వాత ఈ ఊహాగానాలు పుంజుకున్నాయి. నివేదించబడినట్లుగా ఇది రహస్య సమావేశం కాదని చెప్పారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలను కాంగ్రెస్ గమనిస్తోందని, ముంబైలో జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని పటోలే తెలిపారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు కూడా జరిగాయని.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై ఓ కన్నేసి ఉంచిందని, ముంబైలో జరిగే ఇండియా కూటమి సమావేశంలో ఈ విషయం కూడా చర్చకు రానుందని ఆయన చెప్పారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఇండియా) బ్యానర్తో కూడిన ఉమ్మడి ప్రతిపక్ష నాయకులు ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీలలో ముంబైలో తమ మూడో సమావేశాన్ని నిర్వహించబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు ముందుగా తెలిపాయి.
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!