ఐపీఎల్ సీజన్ 17లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లోనే తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. అది కూడా.. కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో మ్యాచ్ విన్ అయ్యారు. ఈ సీజన్ లో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు గైక్వాడ్ చేపట్టారు. ఇకపోతే.. కెప్టెన్ గా రుతురాజ్ వ్యవహరించడమే కానీ, మ్యాచ్ లో మొత్తం సూచనలిచ్చేది మాత్రం ధోని అనే చెప్పాలి. ఎందుకంటే.. అతనికి కెప్టెన్ గా చేసిన అనుభవం…
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ 17వ సీజన్ ఎట్టకేలకి మొదలైంది. శుక్రవారం మొదలైన ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా మొదటి మ్యాచ్ చపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగగా చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ముస్తఫిజూర్ రెహమాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.…
ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్తో ఎంఎస్ ధోని మరోసారి క్రికెట్ మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగే ఈ బ్లాక్బస్టర్ మ్యాచ్కు ముందు, భారత మాజీ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ఎంస్ ధోనీకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. ఆర్సీబీతో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్కు ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఎంఎస్ ధోని మరోసారి అందరికీ షాకిస్తూ కెప్టెన్సీ నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. మహి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎంఎస్ ధోనీ తన జీవితంలోని ప్రతి ప్రధాన నిర్ణయాన్ని ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా ఈ పద్ధతిలోనే తీసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.
సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు అని చెప్పింది.
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది.