Pakistan Israel War: అప్పుడు భారత్, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్.. పాక్లో చైనా వ్యవస్థలు విఫలం..!
- ఇస్లామాబాద్పై దాడి చేసిన తాలిబాన్ డ్రోన్లు..
- మరోసారి పాక్లో చైనీస్ రక్షణ వ్యవస్థలు విఫలం..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇదే పరిస్థితి..
Pakistan Israel War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పాక్ యుద్ధవిమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. పాక్ రాజధాని ఇస్లా్మాబాద్పై డ్రోన్లలో తాలిబాన్లు దాడులు చేశారు. పాక్ ప్రధాని కార్యాయానికి కూతవేటు దూరంలో ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు, కరాచీలో కూడా పాక్ హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్లోని ఫైజాబాద్ సమీపంలోని ఒక సైనిక శిబిరం, నౌషెరాలోని ఒక సైనిక కంటోన్మెంట్, జామ్రుద్లోని సైనిక కాలనీపై, అబోటాబాద్పై దాడులు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెద్దగా వైమానిక శక్తి లేకపోయినా తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ రాజధానిని చేరుకున్నాయి.
చైనీస్ వ్యవస్థలు మళ్లీ విఫలమయ్యాయా?
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కనిపెట్టడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దారుణంగా విఫలమయ్యాయి. మన క్షిపణుల ముందు పాక్ వద్ద సమాధానాలు లేవు. తాజాగా, ఆఫ్ఘానిస్తాన్ చేసిన దాడిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇస్లామాబాద్ వరకు తాలిబాన్ డ్రోన్లు వస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలు కనిపెట్టలేకపోయినట్లు తెలుస్తోంది.
పాక్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు:
HQ-9 (లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్): దీని పరిధి 200-300 కి.మీ. ఇది శత్రువుల యుద్ద విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేసి కూల్చేస్తుంది. ఇస్లామాబాద్ చుట్టూ అనేక బ్యాటరీలను మోహరించారు. పాకిస్తాన్ దీనిని 2021 నుంచి ఉపయోగించడం ప్రారంభించింది.
HQ-16 / LY-80 (మీడియం-రేంజ్ ఎయిర్ డిఫెన్స్): దీని పరిధి 40-70 కి.మీ. మధ్యస్థ ఎత్తులో వచ్చే డ్రోన్లు, హెలికాప్టర్లు, జెట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇస్లామాబాద్, పాక్ సరిహద్దుల్లో వీటిని హోరించారు.
FM-90 / HQ-7 (షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్): దీని పరిధి 15 కి.మీ. ఇది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుంటుంది.
చైనా నుంచి కొనుక్కున్న ఈ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిగా పనిచేయలేదు. భారత్ వద్ద ఉన్న ఎస్-400 మాత్రం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. ఆ సమయంలో పాక్లోని చైనా HQ-9 విఫలమైంది. 2025 ఇండో-పాక్ వివాదంలో HQ-9 యొక్క లోపాలు స్పష్టంగా కనిపించాయి – ఇది భారత క్షిపణులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. చైనా వ్యవస్థలు రష్యన్ S-300 యొక్క కాపీలు అని నిపుణులు అంటున్నారు. ఇవి అంత సమర్థవంతంగా పనిచేయలేదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!