IPL 2024: ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్గా రుత్రాజ్ గైక్వాడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే మేనేజ్మెంట్కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్కే మెంటార్గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ ఫేస్బుక్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వేచి చూడండి’ అని ధోనీ తన పోస్టులో పేర్కొన్నాడు. దాంతో ఫాన్స్ అందరూ అయోమయంలో పడిపోయారు. కెరీర్ చరమాంకంలో ఉన్న 42 ఏళ్ల ధోనీ.. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవుతాడా? అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చినపుడు, పరిమిత ఓవర్లకు రిటైర్మెంట్ ఇచ్చినపుడు కూడా ధోనీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఏమైనా షాక్ ఇస్తాడేమేనని మహీ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా మరో కొద్ది రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
Also Read
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
Also Read: Katrina Kaif Pregnant: తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్ను ఆరంభించింది. అయితే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ఇంకా క్యాంప్లో చేరలేదు. ఆ మధ్య అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకు వెళ్లిన ధోనీ.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యాడు. మధ్యమధ్యలో యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే.. ఐపీఎల్కు మహీ గుడ్బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ఇస్తే.. చెన్నై కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!