IPL 2024: ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్గా రుత్రాజ్ గైక్వాడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే మేనేజ్మెంట్కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్కే మెంటార్గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ ఫేస్బుక్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ‘కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వేచి చూడండి’ అని ధోనీ తన పోస్టులో పేర్కొన్నాడు. దాంతో ఫాన్స్ అందరూ అయోమయంలో పడిపోయారు. కెరీర్ చరమాంకంలో ఉన్న 42 ఏళ్ల ధోనీ.. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవుతాడా? అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చినపుడు, పరిమిత ఓవర్లకు రిటైర్మెంట్ ఇచ్చినపుడు కూడా ధోనీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఏమైనా షాక్ ఇస్తాడేమేనని మహీ ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా మరో కొద్ది రోజుల్లో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
Also Read: Katrina Kaif Pregnant: తల్లి కాబోతున్న కత్రినా కైఫ్.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2024 కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే చెపాక్ స్టేడియంలో ట్రెయినింగ్ క్యాంప్ను ఆరంభించింది. అయితే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ఇంకా క్యాంప్లో చేరలేదు. ఆ మధ్య అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకు వెళ్లిన ధోనీ.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యాడు. మధ్యమధ్యలో యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే.. ఐపీఎల్కు మహీ గుడ్బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ధోనీ రిటైర్మెంట్ ఇస్తే.. చెన్నై కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!