వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో 'లైలా' అనే చిత్రంలో అమ్మాయి గెటప్లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చేస్తున్నాడు.
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి 'గరుడన్'తో అద్భుతమైన బ్లాక్బస్టర్ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్గా ఎంపికైంది. సన్ ఆఫ్ సర్దార్లో హీరోగా అజయ్ దేవగన్ నటించగా.. ప్రతినాయకుడిగా ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించారు. వారు ఈ సీక్వెల్లో కూడా కనిపిస్తారు. అయితే సన్ ఆఫ్ సర్దార్లో హీరోయిన్గా సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే. కానీ సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించనున్నారు.
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్తో సహా తారల నటనను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విజయంతో ఇతర నిర్మాతల మదిలో భయం నెలకొంది.
అగ్ర కథానాయకుడు అజిత్కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు.
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోల నుంచి ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ చిత్రంలో చాలా క్యామియో అప్పియరన్సులు ఉన్నాయి.
పాన్ ఇండియా లెవెల్లో హీరో సూర్యకు ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.