ఈరోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో ఈ ఎన్నికలు ముగియనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాత్రి 8 గంటలకు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటు ప్యానళ్ల సభ్యుల మధ్య జరుగుతున్న వాగ్వివాదం, లోపల గొడవ పడుతున్న సభ్యులు బయటకు వచ్చాక అసలేమీ జరగలేదనతో కప్పి పుచ్చడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. Read Also : “మా” ఎలక్షన్స్…
మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు మరియు చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులు అని.. మా ఎన్నికల నేపథ్యంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మా ఎన్నికల కు ఇంత హడావిడి అవసరం లేదని… సినిమా చేసే వాళ్ళు ఆదర్శంగా ఉండాలని సూచించారు. మా ఎన్నికల కారణంగా సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే లేదని…
‘మా’ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు పానెల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు ప్యానల్స్ కి మద్దతుగా గళం విప్పుతున్నవారు ఉన్నారు. తాజాగా తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని,…
మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు…
నటుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. ఇటీవలే విష్ణు తన ప్యానల్ ప్రకటించారు. తాజాగా ఆయన ఎన్టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు తనకే వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా అజెండా, మ్యానిఫెస్టో చూశాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని…
వరుస వివాదాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులపై విచారణ జరుగుతోంది. మరోవైపు “మా” అధ్యక్ష ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే “మా” అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీనితో “మా”లోని లొసుగులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి ప్రవేశించడం, బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేయడం వంటి విషయాలు మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి.…
ఇవాళ కృష్ణాష్టమి! ఈ సందర్భంగా ప్రతి హిందువు ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. బాలకృష్ణుడి పాదాలను ఇంటి ప్రాంగణంలో ముద్రలుగా వేసుకునే వాళ్ళు కొందరైతే, తమ చిన్నారులను బాలకృష్ణుడిగా అలంకరిస్తున్న వారు మరికొందరు. సినిమా రంగం కూడా దానికి మినహాయింపేమీ కాదు. హీరో మంచు విష్ణు, ఆయన భార్య విరోనికా రెడ్డి తన కుమారుడు అవ్రామ్ కు బాలకృష్ణుడి వేషం వేశారు. నాలుగేళ్ళ అవ్రామ్ లో కృష్ణుడి కొంటె లక్షణాలు ఉన్నాయంటూ మురిసిపోతున్నారు తాతయ్య మోహన్ బాబు.…
మోహన్ బాబు కు కోపం ఎక్కువ. ఇది అందరూ చెప్పే మాట. అయితే ఆయనకు కోపం ఎందుకొస్తుంది? ఎప్పుడొస్తుంది? అనేది మాత్రం ఆయనతో పనిచేసిన వారికి, సన్నిహితులకు మాత్రమే తెలిసిన సత్యం. సమయపాలన, క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే మోహన్ బాబు… దానిని పాటించని వారి పట్ల కోపం ప్రదర్శిస్తారు. ఎంతమంది ముందు అయినా వారిని గట్టిగా మందలిస్తారు. దాంతో ఆయన ఆగ్రహం హైలైట్ అవుతుంది తప్పితే, దాని వెనుక కారణం కాదు. ఇదిలా ఉంటే… నటుడిగా…