టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ…
“కౌన్ బనేగా క్రోర్ పతి” ఒక ఉత్తేజకరమైన గేమ్ షో. ఇక్కడ పోటీదారులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్లో ప్రారంభమైంది. ఎండెమోల్ షైన్ ఇండియా స్టార్, ఎంఏఏ సహకారంతో తెలుగులో “కౌన్ బనేగా క్రోర్ పతి”ని “మీలో ఎవరు కోటీశ్వరులు”గా నిర్మించింది. అయితే అంతకు ముందే ఈ…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక…
టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో ఆయనను ట్రోల్ చేస్తున్న వారిపై పిర్యాదు చేయడానికి ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు పరువు తీస్తున్నాయని మోహన్ బాబు న్యాయ సలహాదారు సంజయ్ సైబరాబాద్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు. Read Also : తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్ సదరు యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యక్తిగత లాభాల కోసం…
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.
ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్…