టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో ఆయనను ట్రోల్ చేస్తున్న వారిపై పిర్యాదు చేయడానికి ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు పరువు తీస్తున్నాయని మోహన్ బాబు న్యాయ సలహాదారు సంజయ్ సైబరాబాద్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు. Read Also : తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్ సదరు యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యక్తిగత లాభాల కోసం…
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.
ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు రచించిన ‘రామబాణం’ పుస్తకాన్ని ఆలయ ఛైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘పుస్తకం బాగుంది. ఈ రామబాణం ప్రజాదరణ పొందాలి. అలాగే కరోనా తొలగి ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అన్నారు. తన పుస్తకం ‘రామబాణం’కు మోహన్ బాబు ముందుమాట చక్కగా రాశారని, ఆయన చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించటం ఆనందంగా ఉందని అన్నారు పూజారి రాంబాబు.
(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇందులో హీరో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో కలసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో మంగవారం ఉదయం విడుదల కానుంది. ‘జయ జయ మహావీర’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సినిమాలో మోహన్ బాబు పాత్రను…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. “నేను మీ మోహన్ బాబు…. 1995 సంవత్సరం నాటికి తెలుగు సినిమా పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు… 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరియర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు… 1995 జూన్ 15 ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన 26 సంవత్సరాల తర్వాత……
(జూన్ 12తో ‘పాలు – నీళ్ళు’కు 40 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ‘గురువుగారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుదే! చిత్రసీమకు దాసరి చిత్రాల ద్వారా పరిచయమైన వారూ, వారి ద్వారా సినిమా రంగంలో రాణించిన వారు – ఇలా దాసరికి ఎంతోమంది శిష్యప్రశిష్యులు ఉన్నారు. వారిలో విలక్షణ నటుడు మోహన్ బాబు స్థానం ప్రత్యేకమైనది. దాసరి తెరకెక్కించిన అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మోహన్ బాబును హీరోగా నిలపాలని దాసరి…
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన తాజా చిత్రం “సన్నాఫ్ ఇండియా” సినిమా టీజర్ కు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి, అలాగే టీజర్ రిలీజ్ చేసిన సూర్య గురించి ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. “నేను సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని తీస్తున్నాను అని నా అభిమానులకు, ప్రేక్షకులకి తెలుసు. సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది. విష్ణు వెంటనే చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుంది అన్నాడు.…