Mohan Babu Meets Chandrababu: చంద్రబాబుతో మోహన్బాబు భేటీ.. సుదీర్ఘ చర్చలు.. విషయం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది..
అయితే, ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మోహన్బాబు.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. కొత్త చర్చ మొదలైంది.. మరోసారి రాజకీయాల్లోకి మోహన్బాబు రాబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది… కాగా, టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల వివాదం సమయంలో.. అప్పుడు మంత్రిగా ఉన్న పేర్నినాని తన ఇంటికి వెళ్లిన సమయంలో అధికారం అంటే తనకు ఆసక్తిపోయిందని వ్యాఖ్యానించారు మోహన్బాబు.. 1995లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై సేవ చేశాను.. 1998లో బీజేపీకి ఏపీలో మంచి సీట్లు రావడానికి నేనే కారణం.. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశాను.. వారి గెలుపులో నా పాత్ర ఉంది.. నాకు అన్ని పార్టీల్లో పరిచయాలు ఉన్నాయి.. అందరు నేతలు నా ఇంటికి వస్తుంటారు.. పోతుంటారు అని వ్యాఖ్యానించారు.. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబును కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అనే చర్చ మొదలైంది.
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
వైఎస్ జగన్ సమీప బంధువు అని చెప్పుకునే మోహన్బాబు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసినా.. ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, సినిమా టికెట్ల వివాదం విషయంలో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్ లాంటి వారిని పిలిచి తనను పిలవక పోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.. మా ఎన్నికల్లో తమ కుమారుడు విజయం సాధించినా.. సినీ పరిశ్రమలు తాము ఒంటరిగా మిగిలిపోయామనే ఆవేదనతో ఆయన ఉన్నారని టాక్.. అయితే, చంద్రబాబుతో మోహన్బాబు భేటీకి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం నడిపినట్టు చర్చ సాగుతోంది.. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానెల్కు సపోర్ట్ చేస్తే.. బాలయ్య అండ్ గ్యాంగ్ మాత్రం విష్ణుకు అండగా నిలిచింది.. ఆ ఎన్నికల్లో బాలయ్య టీమ్ కృషి వల్లే విష్ణు విజయం సాధించారని చెబుతుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మన మధ్య గ్యాప్ ఎందుకు? అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేద్దాం.. చంద్రబాబును మీరు కలవడం అని బాలయ్య సూచించడంతో.. ఇవాళ్టి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ, మోహన్బాబు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సందర్భాలు లేవు.. ఇదే సమయంలో.. తనకంటూ ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్న ఉద్దేశంతోనే మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!