Mohan Babu Meets Chandrababu: చంద్రబాబుతో మోహన్బాబు భేటీ.. సుదీర్ఘ చర్చలు.. విషయం ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సినీ నటుడు మోహన్బాబు భేటీ అయ్యారు.. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించినట్టు సమాచారం.. దశాబ్ధ కాలంగా చంద్రబాబుతో మోహన్బాబుకు గ్యాప్ ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ.. ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు మోహన్బాబు.. ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమనేవారు.. కానీ, తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది..
అయితే, ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మోహన్బాబు.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. కొత్త చర్చ మొదలైంది.. మరోసారి రాజకీయాల్లోకి మోహన్బాబు రాబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది… కాగా, టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య సినిమా టికెట్ల వివాదం సమయంలో.. అప్పుడు మంత్రిగా ఉన్న పేర్నినాని తన ఇంటికి వెళ్లిన సమయంలో అధికారం అంటే తనకు ఆసక్తిపోయిందని వ్యాఖ్యానించారు మోహన్బాబు.. 1995లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై సేవ చేశాను.. 1998లో బీజేపీకి ఏపీలో మంచి సీట్లు రావడానికి నేనే కారణం.. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశాను.. వారి గెలుపులో నా పాత్ర ఉంది.. నాకు అన్ని పార్టీల్లో పరిచయాలు ఉన్నాయి.. అందరు నేతలు నా ఇంటికి వస్తుంటారు.. పోతుంటారు అని వ్యాఖ్యానించారు.. కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబును కలవడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అనే చర్చ మొదలైంది.
Also Read
వైఎస్ జగన్ సమీప బంధువు అని చెప్పుకునే మోహన్బాబు.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసినా.. ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు.. ఇక, సినిమా టికెట్ల వివాదం విషయంలో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్ లాంటి వారిని పిలిచి తనను పిలవక పోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.. మా ఎన్నికల్లో తమ కుమారుడు విజయం సాధించినా.. సినీ పరిశ్రమలు తాము ఒంటరిగా మిగిలిపోయామనే ఆవేదనతో ఆయన ఉన్నారని టాక్.. అయితే, చంద్రబాబుతో మోహన్బాబు భేటీకి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్యవర్తిత్వం నడిపినట్టు చర్చ సాగుతోంది.. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానెల్కు సపోర్ట్ చేస్తే.. బాలయ్య అండ్ గ్యాంగ్ మాత్రం విష్ణుకు అండగా నిలిచింది.. ఆ ఎన్నికల్లో బాలయ్య టీమ్ కృషి వల్లే విష్ణు విజయం సాధించారని చెబుతుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో అసలు మన మధ్య గ్యాప్ ఎందుకు? అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేద్దాం.. చంద్రబాబును మీరు కలవడం అని బాలయ్య సూచించడంతో.. ఇవాళ్టి భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ, మోహన్బాబు ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సందర్భాలు లేవు.. ఇదే సమయంలో.. తనకంటూ ఒక రాజకీయ పార్టీ అండ ఉండాలన్న ఉద్దేశంతోనే మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!