నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ…
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నాత్) మృతి చెందారు. కోల్ కత్లాలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తుండగానే ఆయన కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. 53 ఏళ్ల ఈ బాలీవుడ్ సింగర్ గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో హిట్లను అందించారు. కోల్కతాలో జరిగిన ఒక వేడుకలో ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తుండగా ఆయన కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే కేకేను కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి తీసుకెళ్లారు.…
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో దేశం నెంబర్ గా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డబ్బా ఇల్లు వద్దు అన్న తెలంగాణ ప్రభుత్వం.. 8 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని ఇళ్ళు కట్టినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధిని 21 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారని గుర్తు చేశారు. దేశ…
దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులని విడుదల చేశారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే నిధులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు భరోసా అందిస్తున్నారన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామంలోనే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని నిరూపించారు. రైతులకు అవసరమయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆఫ్రికా దేశాలకు మనలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని…
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే తారకరామారావుకు వచ్చిన ఆదరణను చూసి బీజేపీ నేతలకు భయం పట్టుకొన్నదని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అక్కడికి అన్ని రాష్ట్రాల మంత్రులు వెళ్లినా కేటీఆర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారని, రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. మోదీ రోజుకు పది డ్రెస్సులు మార్చుడు తప్ప.. ఎనిమిదేండ్లలో దేశానికి ఏమైనా మంచి చేశారా? అని…
తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…
అమిత్ షా మాటలను మరోసారి నరేంద్రమోదీ రిపీట్ చేశారు అంతే.. అంటూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. నిన్న జరిగిన మోడీ హైదరాబాద్ పర్యటలో భాగంగా.. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనపై మోడీ ప్రస్తావించడంతో.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. మోడీ మాటలకు ఈ సందర్భంగా చురకలంటించారు. నరేంద్రమోదీ మాటలను టీఆరెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నరేంద్రమోదీ పచ్చివ్యతిరేకి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం…
ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్కి చేరుకోనున్నారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ…
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు. ఇరు…
జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రధానమంత్రి మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ప్రధాని రాక సమయంలోనే, కేసీఆర్ మరో స్టేట్ లో వుండటంపై పొలిటికల్ కాక రేగుతోంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటన సందర్భంగా హడావిడి చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది. మరోవైపు మోడీ హైదరాబాద్…