Modi-Biden: యూఎస్ ఇండియా మధ్య ద్వైపాక్షిక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. క్వాడ్ సమ్మిట్ లో పాల్గొనేందుకు జపాన్ టోక్యో వెళ్లిన మోదీ వరసగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దేశాధినేతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా క్వాడ్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సమావేశం అయ్యాయి. భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పరస్పర విశ్వాస భాగస్వామ్యం అని మోదీ అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం నమ్మకంతో కూడిందని ఆయన అన్నారు.
ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ తో పాటు ఇరు దేశాల అధికారులు పాల్గొన్నారు. చర్చల సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంతో చైనా విఫలం అయిందని.. అదే సమయంలో భారత్ విజయం సాధించిందని జో బైడెన్ కొనియాడారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఇండియా కోవిడ్ ను కంట్రోల్ చేసిందని ఆయన అన్నారు. మోదీ విజయం ప్రజాస్వామ్య దేశాల్లో నమ్మకం నింపిందని.. చైనా, రష్యా వంటి నిరంకుశ ప్రభుత్వాలు మెరుగైన పాలనను అందిస్తాయనే అపోహాను చేధించాయి అని అన్నారు.
Also Read
తాజాగా క్వాడ్ లీడర్ల మధ్య ఇది నాలుగో భేటీ. గతేడాది సెప్టెంబర్ లో అమెరికా వాషింగ్టన్ వేదికగా సమావేశాలు జరిగాయి. క్వాడ్ సమ్మిట్ లో ప్రధానంగా నేతలంతా ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి, భద్రత, వాణిజ్యం, వ్యాపారం గురించి చర్చించారు. అంతరిక్షం, వాతావరణ మార్పు, ఆరోగ్యం, సైబర్ భద్రత వంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా చేస్తున్న దురాక్రమణను సమర్థంగా ఎదుర్కొనేందుకు జపాన్, ఆస్ట్రేలియా,ఇండియా, యూఎస్ఏ లు కలిసి క్వాడ్ పేరిట కూటమిని ఏర్పాటు చేశాయి.
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!