Quad Summit: క్వాడ్ సమ్మిట్ పాల్గొననున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 శాతం ఇండో పసిఫిక్ రీజియన్ ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంత భద్రతపై నాలుగు దేశాలు చర్చలు జరపనున్నాయి.
మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కాననున్నారు. ఈ నాలుగు దేశాల అధినేతలు నాలుగోసారి సమావేశం అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో వాషిింగ్టన్ వేదికగా కలుసుకున్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే నేరుగా చైనా గురించి చర్చించకున్నా.. ప్రాంతీయ భద్రతపై మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ వంటి అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ ట్రేడ్ పై నాలుగు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే క్వాడ్ లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్య-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పటి వరకు రష్యా దాడిపై భారత్ నేరుగా స్పందించలేదు. కానీ ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని సూచించింది.
ముఖ్యంగా చైనా దురాక్రమణ.. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే భారత్ తో పాటు జపాన్ తో సరిహద్దు వివాదాలను రాజేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే చైనా, తైవాన్ ను ఆక్రమించుకునేందుకు సమాయత్తం అవుతుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ లో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా చూస్తే రష్యాకు పట్టిన గతే పడుతుందని.. చైనాను సైనికంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా సోలమన్ దీవులతో ఒప్పందం చేసు
- Tags
- india
- Japan
- modi
- Quad Summit
- USA
తాజావార్తలు
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!