Quad Summit: క్వాడ్ సమ్మిట్ పాల్గొననున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 శాతం ఇండో పసిఫిక్ రీజియన్ ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంత భద్రతపై నాలుగు దేశాలు చర్చలు జరపనున్నాయి.
మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కాననున్నారు. ఈ నాలుగు దేశాల అధినేతలు నాలుగోసారి సమావేశం అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో వాషిింగ్టన్ వేదికగా కలుసుకున్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే నేరుగా చైనా గురించి చర్చించకున్నా.. ప్రాంతీయ భద్రతపై మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ వంటి అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ ట్రేడ్ పై నాలుగు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే క్వాడ్ లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్య-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పటి వరకు రష్యా దాడిపై భారత్ నేరుగా స్పందించలేదు. కానీ ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని సూచించింది.
ముఖ్యంగా చైనా దురాక్రమణ.. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే భారత్ తో పాటు జపాన్ తో సరిహద్దు వివాదాలను రాజేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే చైనా, తైవాన్ ను ఆక్రమించుకునేందుకు సమాయత్తం అవుతుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ లో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా చూస్తే రష్యాకు పట్టిన గతే పడుతుందని.. చైనాను సైనికంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా సోలమన్ దీవులతో ఒప్పందం చేసు
- Tags
- india
- Japan
- modi
- Quad Summit
- USA
తాజావార్తలు
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!