మోడీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ తృప్తి చెందుతారని రాష్ట్ర అద్యక్షుడు అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోదీ, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపతి ముర్ము తల్లిగా దేశ సేవ చేస్తారని ఆకాంక్షించారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోడీ సభకు గిరిజన,…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముర్ము నామినేషన్పై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల సందడి నెలకొంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎన్డీయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయి. చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో…
బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…
* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత * తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు. * నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు. * ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.…
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు నిరాకరించారు జమ్మూ కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి ఎన్సీపీ నేత శరద్ పవార్ అయిష్టత ప్రకటించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షనేతల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్ల పరిశీలించారు. కాశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొన్నాళ్ళపాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు ఫరూక్ అబ్దుల్లా. రాష్ట్రపతి ఎన్నికల…
మోడీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వరంగల్ బిడ్డ రాకేష్ బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండి పడ్డారు. బీజేపీ కి ఇక శంకర గిరి మాన్యాలే అంటూ విమర్శించారు. మా తెలంగాణ బిడ్డల రక్తం కళ్ళ జూసిన వారెవ్వరూ బాగు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి పుట్టగతులు లేకుండా చేస్తామని నిప్పులు చెరిగారు.…