కేటీఆర్ తప్పులు చేస్తే.. మంత్రి పదవి ఇచినావు ! విద్యార్దులు తప్పు చేస్తే..మన్నించలేవా..? అంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ.. అగ్ని పథ్ తెచ్చి దేశ భద్రతను చీకట్లో కి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటారు అలాంటిది సైనికుల కు అరు నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. కోటి జనాభా లేని ఇజ్రాయిల్ తో మన దేశంని పోల్చడం ఏంటని మండిపడ్డారు రేవంత్. అది బీజేపీ…
సిద్దిపేట రూరల్ మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. మండలంలోని రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గడిచిన ఎనిదేళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? అంటూ మండిపడ్డారు. సీసీ రోడ్లు ఎన్ని? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందుతులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్ అయి వారికి అండగా ఉంటామని, సికింద్రాబాద్ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పై…
మోడీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ తృప్తి చెందుతారని రాష్ట్ర అద్యక్షుడు అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోదీ, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపతి ముర్ము తల్లిగా దేశ సేవ చేస్తారని ఆకాంక్షించారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోడీ సభకు గిరిజన,…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముర్ము నామినేషన్పై మోదీ, అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము…
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల సందడి నెలకొంది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఎన్డీయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి.. తపన పడుతన్నాయి. చేతిలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉంచుకుని వేరే వారిని వెతుక్కోవడం దేనికి..? ఉప రాష్ట్రపతులు.. రాష్ట్రపతులు అయిన సంప్రదాయం మన దేశంలో…