Parliament Monsoon Session 2022: ఈనెల 18న వర్షాకాల సమావేశాలు.. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివరించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్యక్రమంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై చర్చించనున్నారు. జూలై 16న సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.
read also: 2022 లో మోస్ట్ పాపులర్ సినిమాలు ఏంటో తెలుసా..?
Also Read
అయితే.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. ఇక అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈనేపథ్యంలో.. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రకారంగా అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్ దాఖలుచేసే అవకాశముంది. ఇక ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. అయితే.. 16న భాజపా ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా.. భాజపా పార్లమెంటరీ పార్టీ ఈనెల 16న తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేసింది. ఈనేపథ్యంలో.. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రుల సమావేశం మాత్రం 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో జరగనుంది. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 17న విపక్షాలు భేటీ కానున్నాయి. కావున రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నేతలంతా విచ్చేసే అవకాశముంది. కాగా.. ఎంపీలంతా ఆరోజు సాయంత్రం 6.30 గంటలకల్లా పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియానికి చేరుకోవాలని పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!