Parliament Monsoon Session 2022: ఈనెల 18న వర్షాకాల సమావేశాలు.. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివరించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్యక్రమంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి భవన్లో ఎగువసభా పక్ష నేతలతో భేటీ అవుతారు. సమావేశాల నిర్వహణ, సభ్యుల సహకారంపై చర్చించనున్నారు. జూలై 16న సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా లోక్సభాపక్ష నేతలతో సమావేశమై.. సభ సజావుగా జరిగేందుకు వారి మద్దతు కోరనున్నారు. కాగా.. ఈ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12తో ముగుస్తాయి.
read also: 2022 లో మోస్ట్ పాపులర్ సినిమాలు ఏంటో తెలుసా..?
Also Read
అయితే.. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఆయనకు ఇవే చివరి రాజ్యసభ సమావేశాలు కానున్నాయి. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం ఈనెల 5న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ 19వ తేదీతో ముగుస్తుంది. ఇక అధికార, విపక్షాలు మాత్రం ఇంతవరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈనేపథ్యంలో.. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈనెల 16న ఉపరాష్ట్రపతి అభ్యర్థిని వెల్లడిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ ప్రకారంగా అధికార కూటమి అభ్యర్థి 18-19 తేదీల్లో ఏదో ఒకరోజు నామినేషన్ దాఖలుచేసే అవకాశముంది. ఇక ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. అయితే.. 16న భాజపా ఎంపీలకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా.. భాజపా పార్లమెంటరీ పార్టీ ఈనెల 16న తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా విందు ఏర్పాటుచేసింది. ఈనేపథ్యంలో.. ఎన్డీయే కూటమి ఎంపీలు, మంత్రుల సమావేశం మాత్రం 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో జరగనుంది. ఇక వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 17న విపక్షాలు భేటీ కానున్నాయి. కావున రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నేతలంతా విచ్చేసే అవకాశముంది. కాగా.. ఎంపీలంతా ఆరోజు సాయంత్రం 6.30 గంటలకల్లా పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియానికి చేరుకోవాలని పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వర్తమానం పంపింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
-
OTT Movie: హత్య కేసును ఛేదించే గొర్రెల మంద.. ఈ సినిమా కాన్సెప్ట్ మైండ్ బ్లోయింగ్!
-
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!