భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార రంగాలలోని ప్రముఖులు సినిమా నటులతో ఇతర దేశాల అధ్యక్షులతో పాటు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు నరేంద్ర మోడీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. వారిలో ఎవరెవరు ఏమన్నారంటే.. JR NTR : అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.…
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది.
ప్రధాని మోడీ బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులంతా బర్త్డే విషెస్ చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వరకు.. ఇలా నాయకులంతా శుభాకాంక్షలు చెప్పారు.
ప్రధాని మోడీ రెండేళ్ల తర్వాత తొలిసారి మణిపూర్లో అడుగుపెట్టారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో రాష్ట్రం అట్టుడికింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. భారీ వర్షం మధ్య ప్రధాని మోడీ ఇంఫాల్కు చేరుకున్నారు.
ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్తో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
చైనా వేదికగా టియాంజిన్లో జరిగిన షాంఘై సహకార సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సహా ఆయా దేశాల ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానించారు.
ఉక్రెయిన్తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు.