Modi-Trump: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ ఏం జరగలేదు.. ఖండించిన భారత్
- మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణే జరగలేదు
- రష్యా చమురుపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని.. ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. ఈ విషయంపై ఇరువురు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపింది. మోడీ- ట్రంప్ మధ్య ఈ మధ్య కాలంలో ఎలాంటి సంభాషణ జరగలేదని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై రష్యా కూడా స్పందించింది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య ఇంధన బంధం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
Also Read
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
రష్యా దగ్గర పాశ్చాత్య దేశాలు, భారతదేశం చమురు కొనుగోలు చేయడం వల్ల ఉక్రెయిన్పై యుద్ధం ఆగడం లేదని పదే పదే ట్రంప్ ఆరోపించారు. రష్యా ఆర్థికంగా బలపడడం వల్లే ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని.. లేదంటే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అన్నట్టుగానే భారత్పై 50 శాతం సుంకం విధించారు. అలాగే చైనాపై 100 శాతం సుంకం విధించారు. అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేసినట్లు మోడీ తనకు చెప్పారని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
ఇది కూడా చదవండి: Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
ఇక ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ప్రధాని మోడీ ట్రంప్కు భయపడుతున్నారని ఆరోపించారు. భారత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ట్రంప్నకు మోడీ ధారాదత్తం చేసినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘కొన్ని రోజుల క్రితం వాణిజ్య ఒప్పందం ఎందుకు లేదని కాంగ్రెస్ అడగడం నేను విన్నాను. ఇది చుక్కాని లేని, నాయకుడు లేని, దిశానిర్దేశం లేని పార్టీ. కాంగ్రెస్ నిజంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేడు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ను తమ నాయకుడిగా చూడటం లేదని, దేశ నాయకత్వాన్ని మర్చిపోతున్నాయని నేను అనుమానిస్తున్నాను.’’ అని గోయల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh Student Suicides: విద్యార్థుల ఉసురు తీసిన అవమానం..
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!