బంతి ఇప్పుడు ఇరాన్ కోర్టులో ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. హంగేరీలోని బుడాపెస్ట్లో జేడీ వాన్స్ మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ ప్రభుత్వం విశ్వాసంగా ఉందన్నారు. అయితే చర్యల విషయంలో మాత్రం అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండదని సూచించారు.
రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడుల్లో హతం అయ్యాక.. ఆయన కుమారుడు మోజ్తాబా కొత్త సుప్రం లీడర్గా నియమితులయ్యారు. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు.