US-Iran Peace Talks: లెబనాన్పై దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్ పంతం.. చర్చలపై ప్రతిష్టంభన
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు
- లెబనాన్పై దాడులు ఆపాలని ఇరాన్ పంతం
- షరతులపై ఇరాన్ పట్టుదలగా ఉన్నట్లు కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అయితే చర్చలకు ముందు ఇరాన్ తన డిమాండ్లను ముందు పెట్టింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ వాదించినట్లుగా తెలుస్తోంది. ముందు లెబనాన్లో పరిస్థితులు చక్కబడాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.
అయితే ముందు తమ షరతులు అంగీకరిస్తేనే అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రతినిధి బృందం తమ డిమాండ్లపై పట్టుదలతో ఉన్నట్లుగా పేర్కొంది. అమెరికా ప్రతినిధి బృందం షరతులను అంగీకరిస్తుందా లేదా అనే దానిపైనే చర్చలు ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చర్చలు ఒక్కరోజులో పూర్తి కావని.. రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వార్తలు వస్తున్నాయి.
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ఇరాన్ డిమాండ్లు ఇవే..
ఇరాన్ ప్రధానంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని.. అలాగే అమెరికా ఫ్రీజ్ చేసిన ఆస్తులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ చెబుతోంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు బృందాలతో పరోక్ష చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు బృందాల నుంచి సానుకూల స్పందన వస్తే మాత్రం.. ఈ రాత్రికి రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఉండనున్నాయి.
అయితే ఈ చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుందని.. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి కూడా తెరుస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ దాడులు చర్చలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!