US-Iran Peace Talks: లెబనాన్పై దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్ పంతం.. చర్చలపై ప్రతిష్టంభన
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు
- లెబనాన్పై దాడులు ఆపాలని ఇరాన్ పంతం
- షరతులపై ఇరాన్ పట్టుదలగా ఉన్నట్లు కథనాలు
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అయితే చర్చలకు ముందు ఇరాన్ తన డిమాండ్లను ముందు పెట్టింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ వాదించినట్లుగా తెలుస్తోంది. ముందు లెబనాన్లో పరిస్థితులు చక్కబడాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.
అయితే ముందు తమ షరతులు అంగీకరిస్తేనే అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రతినిధి బృందం తమ డిమాండ్లపై పట్టుదలతో ఉన్నట్లుగా పేర్కొంది. అమెరికా ప్రతినిధి బృందం షరతులను అంగీకరిస్తుందా లేదా అనే దానిపైనే చర్చలు ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చర్చలు ఒక్కరోజులో పూర్తి కావని.. రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వార్తలు వస్తున్నాయి.
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఇరాన్ డిమాండ్లు ఇవే..
ఇరాన్ ప్రధానంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని.. అలాగే అమెరికా ఫ్రీజ్ చేసిన ఆస్తులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ చెబుతోంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు బృందాలతో పరోక్ష చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు బృందాల నుంచి సానుకూల స్పందన వస్తే మాత్రం.. ఈ రాత్రికి రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఉండనున్నాయి.
అయితే ఈ చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుందని.. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి కూడా తెరుస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ దాడులు చర్చలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!