US-Iran Peace Talks: లెబనాన్పై దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్ పంతం.. చర్చలపై ప్రతిష్టంభన
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు
- లెబనాన్పై దాడులు ఆపాలని ఇరాన్ పంతం
- షరతులపై ఇరాన్ పట్టుదలగా ఉన్నట్లు కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాంతి చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధుల బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అయితే చర్చలకు ముందు ఇరాన్ తన డిమాండ్లను ముందు పెట్టింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ వాదించినట్లుగా తెలుస్తోంది. ముందు లెబనాన్లో పరిస్థితులు చక్కబడాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లుగా సమాచారం.
అయితే ముందు తమ షరతులు అంగీకరిస్తేనే అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఇరాన్ ప్రతినిధి బృందం తమ డిమాండ్లపై పట్టుదలతో ఉన్నట్లుగా పేర్కొంది. అమెరికా ప్రతినిధి బృందం షరతులను అంగీకరిస్తుందా లేదా అనే దానిపైనే చర్చలు ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చర్చలు ఒక్కరోజులో పూర్తి కావని.. రెండు రోజుల పాటు కొనసాగవచ్చని వార్తలు వస్తున్నాయి.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
ఇరాన్ డిమాండ్లు ఇవే..
ఇరాన్ ప్రధానంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని.. అలాగే అమెరికా ఫ్రీజ్ చేసిన ఆస్తులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ చెబుతోంది. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు బృందాలతో పరోక్ష చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు బృందాల నుంచి సానుకూల స్పందన వస్తే మాత్రం.. ఈ రాత్రికి రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు ఉండనున్నాయి.
అయితే ఈ చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్పై అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుందని.. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి కూడా తెరుస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఈ దాడులు చర్చలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!