Trump: రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో 5 లక్ష్యాలను పేర్కొన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజాన్ వేళ ఇరాన్తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇరాన్పై మూడు వారాలుగా కొనసాగుతున్న సైనిక చర్యలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, రక్షణ పరిశ్రమను పూర్తిగా నాశనం చేయడం అమెరికా లక్ష్యాల్లో ఒకటి అని.. అలాగే మధ్యప్రాచ్యంలో మిత్రదేశాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ప్రముఖ్యంగా ఐదు లక్ష్యాలను ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు.
1. ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, ప్రయోగ వాహనాలు, వాటికి సంబంధించిన ప్రతిదానిని పూర్తిగా నాశనం చేయడం.
2. ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని నాశనం చేయడం.
3. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం నుంచి విమాన నిరోధక ఆయుధాలను తొలగించడం.
4. ఇరాన్ అణు సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, అటువంటి పరిస్థితి తలెత్తితే అమెరికా త్వరితగతిన, సమర్థవంతంగా స్పందించగల స్థితిలో ఎల్లప్పుడూ ఉండటం.
5. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇతరులతో సహా మధ్యప్రాచ్య మిత్రదేశాలను అత్యున్నత స్థాయిలో రక్షించడం.
హోర్ముజ్..
ఇక హోర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని అమెరికా స్వయంగా ఉపయోగించనందున.. దాని భద్రత, నిఘా బాధ్యతను దానిని ఉపయోగించే దేశాలే చూసుకోవాలని స్పష్టంగా సూచించారు. అవసరమైతే అమెరికా సహాయం చేస్తుందన్నారు. అయితే ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత మాత్రం దాని అవసరం ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.
గతగత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తానికి మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసేటట్లు కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు దాడులు మాత్రం ఆగలేదు. యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Trump-UK: హార్ముజ్ కోసం బ్రిటన్ యూటర్న్.. అమెరికాకు గ్రీన్సిగ్నల్
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!